Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతున్న చేరికలు |
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అలిగిరి ప్రవీణ్రెడ్డి. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రవీణ్ రెడ్డి .. 2014లో ఓడిపోయారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కండువా మార్చేశారు. గులాబీ గూటికి చేరుకున్నారు ప్రవీణ్రెడ్డి. అయితే రెండు దఫాలుగా హుస్నాబాద్లో టీఆర్ఎస్ నుంచి వొడితల సతీష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. దీంతో అధికారపార్టీలో టికెట్ రాదనుకున్నారో లేక.. అక్కడ గుర్తింపు లేదని భావిస్తున్నారో కానీ.. కాంగ్రెస్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట ప్రవీణ్రెడ్డి. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ జోరు పెంచేందుకు ఫోకస్ పెట్టిన పీసీసీ.. ప్రవీణ్రెడ్డి రాకకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఒక్కసారిగా హుస్నాబాద్ కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయి. ప్రవీణ్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోకముందే ఇక్కడి పార్టీ శ్రేణులు ఆయనంటే భగ్గుమన్నాయి.
హుస్నాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్ అనే ఆశలతో పార్టీ పనుల్లో చురుకుగా పాల్గొంటున్నారు కూడా. ఇప్పుడు ప్రవీణ్రెడ్డి రీఎంట్రీ ఇస్తే.. సీటు పంచాయితీ తప్పదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీరామ్ వర్గం దూకుడు పెంచేసింది. పార్టీ నేతలు.. అనుచరులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు శ్రీరామ్. ప్రవీణ్రెడ్డి రాకపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తీర్మానం కూడా చేసేశారు. హుస్నాబాద్ కాంగ్రెస్ శ్రేణులకు తెలియకుండా.. ప్రవీణ్రెడ్డిని ఎలా చేర్చుకుంటారని అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
కామ్గా ఉంటే లాభం లేదని అనుకున్నారో ఏమో.. అసంతృప్తి వర్గం హుస్నాబాద్లో స్వరం పెంచేసింది. తమ అభ్యంతరాలను పట్టించుకోకపోతే.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పార్టీ పెద్దలకు అల్టిమేటం ఇచ్చేశారు. ఇంత జరుగుతున్నా ప్రవీణ్రెడ్డి మాత్రం పార్టీ మార్పుపై ఎక్కడా పెదవి విప్పడం లేదు. రెండు రోజుల్లో అనుచరులతో మీటింగ్ పెట్టుకుని.. తన మనసులో మాట బయటపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో టచ్లో ఉండటంతో.. పార్టీ మార్పుపై ఓపెన్గా చెప్పడమే మిగిలిందన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట.
ఈ మధ్య కాలంలో కాంగ్రెస్లో వివిధ పార్టీల నుంచి నేతలు చేరుతుంటే.. అక్కడి నాయకులకు రుచించడం లేదు. అసంతృప్తి స్వరాలను గట్టిగానే వినిపిస్తున్నారు. వాటిని పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తర్వాత బుజ్జగిద్దామని అనుకుంటున్నారో ఏమో.. అసంతృప్తుల జాబితాలో నియోజకవర్గాల పేర్లు పెరిగిపోతున్నాయి. పార్టీలో చేరికల కమిటీ ఉన్నప్పటికీ.. ముందుగా వారికి చెప్పకపోవడం.. స్థానిక నేతలను ఒప్పించకపోవడం సమస్యగా మారుతోంది. మరి.. హుస్నాబాద్ రగడను పీసీసీ ఎలా చల్లారుస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?