IPL Tickets Issue: తమిళనాడులో ఇప్పుడు ఐపీఎల్ టికెట్లు, చెన్నై సూపర్ కింగ్స్ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే సీఎస్కే టీం ను బ్యాన్ చేయాలని పలువురు రాజకీయ నాయకులు, పార్టీలు కోరతున్నాయి. పీఎంకే శాసనసభ్యుడు ఏకంగా తమిళనాడు అసెంబ్లీలోనే సీఎస్కేని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
CSK doesn't have any players from TN, should be banned: తమిళనాడులో భాషాభిమానం, ప్రాంతీయాభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ భాషకు ఎలాంటి అగౌరవం వాటిల్లినా అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు భగ్గుమంటాయి. ముఖ్యంగా హిందీ మాట్లాడితే ఏదో పాపం చేసినట్లు చూస్తుంటారు కొందరు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సర్కార్ అన్నట్లుగా వ్యవహారం కొసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య గ్యాప్ ఏర్పడింది. ప్రభుత్వానికి సంబంధించిన బిల్లుల విషయంలో గవర్నర్లు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.
Bharat Express Train: ప్రధాని నరేంద్రమోదీ శనివారం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తెలంగాణలో వందేభారత్ ట్రైన్ తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్యలో 12వ వందేభారత్ రైలును ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం అనంతరం తమిళనాడు పర్యటకు వెళ్లారు.
CR Kesavan: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి ముని మనవడు సిఆర్ కేశవన్ శనివారం బిజెపిలో చేరారు. దక్షిణాదిలో మరింగా విస్తరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే దక్షిణాదికి చెందిన ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకుంటోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేశవన్ బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికతో కాంగ్రెస్కు మరో షాక్ తగిలినట్లు అయింది. కేంద్ర మంత్రి వీకే సింగ్, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి…
2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుకను కోసేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ నాయకుడు మణికందన్ బెదిరించాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ న్యాయమూర్తి నాలుకను కోసేస్తానని బెదిరించగా.. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది.
IIT-Madras PhD Student Dies By Suicide: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ-మద్రాస్. ఎంతో మందిని గొప్పవారిని దేశానికి అందించింది. అయితే ఇటీవల మాత్రం తరుచు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మద్రాస్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేస్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన 32 ఏళ్ల విద్యార్థి సచిన్ వేలచ్చేరిలోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Dahi Controversy: తమిళనాడులో భాషాభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర లేదు. హిందీ పదం కనిపిస్తే చాలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటికే అక్కడి స్టాలిన్ ప్రభుత్వం హిందీని తమపై రుద్దవద్దని చెబుతోంది. తాజాగా మరోసారి హిందీ కేంద్రంగా మరో వివాదం తమిళనాడులో చోటుచేసుకుంది. పెరుగు ప్యాకెట్లపై ‘‘దహీ’’ ఉండొద్దని చెబుతోంది తమిళనాడు ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. పెరుగు ప్యాకెట్లపై దహీ అనే పదం ఉండటం హిందీని రద్దు ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
Bus Accident: తమిళనాడు నుంచి కేరళలోని శబరిమలకు అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 64 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
తమ కొడును కొట్టాడనే కారణంతో ఓ ఉపాధ్యాయుడిని చితక్కొట్టారు విద్యార్థి తల్లిదండ్రులు. స్కూల్లో టీచర్ను కొట్టినందుకు రెండో తరగతి విద్యార్థి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు.