హీరో గోపీచంద్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ‘సీటీమార్’.. గోపీచంద్ కు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. భూమిక చావ్లా, దిగంగన సూర్యవంశీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 10న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపథ్యంలో ‘సీటీమార్’ ట్రైలర్ విడుదల చేశారు. గోపీచంద్ ఆంధ్ర కోచ్ గా, తమన్నా తెలంగాణ కోచ్…
మిల్కీ బ్యూటీ తమన్నా రచయితగా మారింది. తాజాగా ఆమె తన బుక్ ను రిలీజ్ చేసింది. ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ ఈరోజు తన కొత్త పుస్తకం ‘బ్యాక్ టు ది రూట్స్’ ను ఆవిష్కరించింది. ఈ బుక్ కు ప్రముఖ లైఫ్ స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హో సహ రచయిత. ఈ పుస్తకంలో తమన్నా ఆరోగ్య రహస్యాలను రివీల్ చేసింది. ఈ బుక్ ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అమెజాన్లో మొదటి స్థానంలో ఉంది.…
ఊహకందని విధంగా ‘సీటీమార్, లవ్ స్టోరీ’ చిత్రాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. థియేటర్లకు ప్రేక్షకులు పెద్దంతగా రాకపోవడం, కరోనా భయాలు తొలగకపోవడం వల్ల అవి వాయిదా పడ్డాయంటే అర్థం ఉంది. కానీ ఓటీటీలో సెప్టెంబర్ 9న స్ట్రీమింగ్ అవుతుందని చెప్పిన ‘మాస్ట్రో’ సినిమా సైతం సెప్టెంబర్ 17కు వాయిదా పడింది. నితిన్, నభా నటేశ్ జంటగా నటించిన ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషించింది. హిందీ చిత్రం ‘అంధాధూన్’ కు రీమేక్ అయిన ‘మాస్ట్రో’…
గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘సీటీమార్’ మూవీ విడుదల తేదీ విషయంలో ఉన్న సస్పెన్స్ కు తెర పడింది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్న వార్త నిజమైంది. ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. కొంతకాలంగా తమ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే పక్కాగా విడుదల చేస్తామని, అదీ సెప్టెంబర్ మాసంలో ఉంటుందని నిర్మాతలు చెబుతూ వచ్చారు. ఇవాళ సెప్టెంబర్ 3వ తేదీ ఈ మూవీ కోసం లాక్ చేసినట్టు అధికారికంగా…
ఇప్పటికే తెలుగులో, తమిళంలో వెబ్ సిరీస్ లు చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా నెక్ట్స్ హిందీలోనూ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. నిజానికి కెరీర్ ప్రారంభంలోనే బాలీవుడ్ మూవీ చేసింది ఆనాటి టీనేజ్ ట్యామీ. అయితే, తరువాత సౌత్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన ఆమె బీ-టౌన్ ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడీ కట్టేశాక మళ్లీ హిందీ తెర మీదకు వెళ్లింది. అజయ్ దేవగణ్, సైఫ్ అలీఖాన్ లాంటి పెద్ద…
దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన తమన్నా.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో ‘డిజిటల్ ప్లాట్ఫామ్స్ లోను రాణిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ మిల్కీ బ్యూటీ హవా తెలియంది కాదు. సినిమాల కంటే ఎక్కువగా తన గ్లామర్ అందాలను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి తమన్నా పసందైన ఆహారాన్ని ఆరగిస్తుండటంతో తను ప్రయాణించాల్సిన విమానాన్ని అందుకోలేకపోయిందని షేర్ చేసింది. నూడిల్స్ ఫొటోను షేర్ చేస్తూ.. నేను ఎక్కాల్సిన ఫ్లైట్…
మిల్కీ బ్యూటీ తమన్నా ముచ్చటగా మూడో వెబ్ సీరిస్ కు పచ్చ జెండా ఊపేసింది. ఇప్పటికే తెలుగులో ‘లెవన్త్ అవర్’, తమిళంలో ‘నవంబర్ స్టోరీ’ వెబ్ సీరిస్ లలో తమన్నా నటించింది. ‘లెవన్త్ అవర్’ బిజినెస్ వరల్డ్ నేపథ్యంలో సాగే వెబ్ సీరిస్ కాగా, ‘నవంబర్ స్టోరీ’ అందుకు పూర్తి భిన్నమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సీరిస్. ఈ రెండు వెబ్ సీరిస్ లలో తమన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో మరికొంతమంది నిర్మాతలు…
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్లన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ ఇంటి పట్టునే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. అలా తమన్నా కూడా షూటింగ్లు లేక ఇంట్లోనే ఉంటున్నారు. అయితే తాజాగా తమన్నా ఓ సందేశాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. షూటింగ్స్ లేక రోజువారీ పనిదినాల్లో కూడా మార్పులు రావడంతో తమన్నా డైలామాలో తెలుస్తోంది. ‘స్నానం చేయాలా.. ? వద్దా..? అనే సందేశాన్ని వ్యక్తం చేస్తూ.. ఓ సలహాని ఇవ్వాలంటూ కోరింది. లాక్ డౌన్ ఇలా…