ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ఆరాచకాలు, ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సంహభాగం ప్రాంతాలను తాలిబన్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే కాబూల్ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెబుతున్న తాలిబన్లు తాజాగా కాందహార్ నగరాన్ని సొంతం చేసుకున్నారు. రాజధాని కాబుల్ తరువాత రెండో పెద్ద నగరంతో పాటుగా, ఆర్ధికంగా, వాణిజ్యపరంగా అభివృద్ది చెందిన నగరం కావడంతో దీనిపైనే దృష్టి పెట్టారు తాలిబన్ ఉగ్రవాదులు. అంతేకాదు, తాలిబన్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది కూడా కాందహార్ నగరంలోనే కావడంతో ఇది వారికి కీలకంగా…
తాలిబన్లకు, ఆఫ్ఘన్ సైన్యానికి మధ్య గత కొన్ని రోజులుగా భీకర పోరు జరుగుతున్నది. నాటో దళాలు, అమెరికా సైన్యం ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని కీలకమైన ప్రాంతాలను సొంతం చేసుకున్నారు. కాందహార్తో పాటు, మూడో అతిపెద్ద కీలక నగరమైన హెరాత్ను కూడా తాలిబన్లు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో రాజధాని కాబుల్ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను తాలిబన్ నేతల ముందుకు…
క్రమంగా ఆఫ్ఘనిస్థాన్పై పట్టు సాధిస్తున్నారు తాలిబన్లు.. త్వరలోనే ఆఫ్ఘన్ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకుంటామని ముందుకు కదులుతున్న తాలిబన్ ఫైటర్లు.. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ బలగాలకు భారత్ బహుమతిగా ఇచ్చిన ఎంఐ-24 అటాక్ హెలికాప్టర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.. భారత్ ఇచ్చిన గిఫ్ట్ను తాము స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు తాలిబన్లు. ఆ హెలికాప్టర్ పక్కన తాలిబన్లు నిలబడి ఉన్న ఫొటోలు, వీడియోలను రిలీజ్ చేవారు.. అయితే, అది ఉపయోగించడానికి వీలు లేకుండా…
ఆఫ్ఘనిస్తాన్లో రోజురోజుకు తాలీబన్ ఉగ్రవాదుల దారుణాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు అక్కడి సామాన్య ప్రజలకు నరకం చూపిస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడంతో ప్రభుత్వ దళాలకు, తాలీబన్లకు మధ్య పోరు జరుగుతున్నది. ఆఫ్ఘన్లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని, అక్కడ ఉండటం ఏమాత్రం సురక్షితం కాదని, ఒకవేళ టికెట్ కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకుంటే రుణాలు అందిస్తామని…
గత కొంత కాలంగా తాలిబన్ ఉగ్రవాదులకు, ఆఫ్ఘన్ ప్రభుత్వ దళాలలకు మధ్య పోరు జరుగుతున్నది. ఇప్పటికే తాలిబన్ ఉగ్రవాదులు కీలక ప్రాంతాలను తమ ఆదీనంలోకి తీసుకోవడంతో ఆయా ప్రాంతాల్లోని అమాయక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే కంధర్ ప్రావిన్స్లోని జెరాయ్ జిల్లాలో ఆఫ్ఘన్ రక్షణ దళాలు ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి. Read: భారత్ కు మరో ఒలంపిక్ మెడల్… ఈ వైమానిక…
ఉగ్రవాదులకు అండగా ఉండే పాక్, వారిపై సానుభూతిని ప్రదర్శించడం సహజమే. ఆఫ్ఘనిస్తాన్లో తాలీబన్లతో కలిసి పనిచేసేందుకు పాక్ ఇప్పటికే పదివేల మందికి పైగా ముష్కరులను ఆ దేశం పంపినట్టు ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్లో 70 శాతానికి పైగా భూభాగాన్ని ఆక్రమించుకున్నామని ఇప్పటికే తాలిబన్లు చెప్తూ వస్తున్నాయి. చిన్నారులను, మహిళలను హింసిస్తున్నారు. వేలాది మంది అమాయక ప్రజలను తాలిబన్లు పొట్టన పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారిపై పాక్ ఉదారతను ప్రదర్శిస్తున్నది. తాలిబన్లు మిలటరీ…
నవ్వడం ఒక వరమైతే, నవ్వించడం గొప్ప వరం. పదిమందిని నవ్విస్తున్న వ్యక్తికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖలో పనిచేస్తున్న నాజర్ మహ్మద్ అనే వ్యక్తి కమెడియన్గా మారిపోయారు. అఫ్ఘనిస్తాన్లో ఖంసా జ్వాన్గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పదిమందికి నవ్వులు పంచుతున్న నాజర్ మహ్మద్ను తాలీబన్లు కిడ్నాప్ చేసి దారుణంగా గొంతుకోసి హత్యచేశారు. ఇస్లామ్ ప్రకారం నవ్వించడం నేరం అని అందుకే నాజర్ను హత్యచేశారని అంటున్నారు. కాందహార్ ప్రావిన్స్లోని…
భారత్ ఆస్తులను లక్ష్యంగా చేసుకొని పాక్ కొత్త ఎత్తులు వేస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్లో తాలీబన్లు ఆక్రమించుకున్న ప్రాంతాల్లోని భారత్ కు సంబందించిన ఆస్తులను ధ్వంసం చేసేందుకు తాలీబన్ ఉగ్రవాదులతో చేతులు కలిపింది. పాక్ చెందిన 10వేల మంది సాయుధులు ఆఫ్ఘన్లోకి అడుగుపెట్టారు. వీరు భారత్ సహకారంతో నిర్మించిన ప్రాజెక్టులు, భవనాలు, రోడ్లను ధ్వంసం చేయబోతున్నారు. ఆఫ్ఘన్ పుననిర్మాణంలో భాగంగా భారత్ ఆ దేశంలో 300 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ కొత్త పార్లమెంట్ భవనంతో పాటుగా అనేక…
ఆఫ్ఘన్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘన్లోని అనేక ప్రాంతాలను తమ స్వాదీనంలోకి తీసుకున్న తాలిబన్లు కాందహార్ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆఫ్ఘన్లో ఉన్న 210 చైనీయులను చైనా గతవారం వెనక్కి తీసుకెళ్లింది. ఆఫ్ఘన్ అంతర్గత ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేసిన నేసథ్యంలో తాలిబన్లు కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా దేశం ఆఫ్ఘనిస్తాన్కు మిత్రదేశంగా భావిస్తున్నామని, షిన్జీయాంగ్ ప్రావిన్స్లో వేర్పాటువాద ఉఘర్ ముస్లీంలకు తాము మద్ధతు ఇవ్వబోమని తాలిబన్లు చైనాకు హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో…
అఫ్ఘన్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో మళ్లీ ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దాదాపు రెండు దశాబ్ధాలపాటు ఆఫ్ఘన్లో అమెరికా బలగాలు మోహరించి ఉగ్రవాదుల కార్యకలాపాలను అణిచివేశాయి. ఎప్పుడైతే ఆ దేశం నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడం మొదలు పెట్టిందో అప్పటి నుంచే తాలిబన్లు ఆఫ్ఘన్లోని కీలక ప్రాంతాలను స్వాదీనం చేసుకోవడం మొదలుపెట్టారు. దక్షిణ ప్రాంతాలపై ఇప్పటికే పట్టుబిగించిన తాలిబన్లు, ఆ ప్రాంతంలో కీలకమైన కాందహార్ ను ఆదీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. Read:…