భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ఎన్నికయ్యారు. జేపీ నడ్డా వారసుడిగా బీహార్ నేతకు అవకాశం దక్కింది. సోమవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కమల దళపతిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు.
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం.. కేబినెట్ విస్తరణ చేపట్టనుంది. ఆదివారం (డిసెంబర్ 15)న నాగ్పూర్లోని రాజ్భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక ప్రమాణ స్వీకారోత్సవంతో తన మంత్రివర్గాన్ని విస్తరించనుంది. దాదాపు 30 మంది కొత్త మంత్రులు చేరే అవకాశం ఉంది. డిసెంబర్ 16న ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలకు ముందే విస్తరణ జరగనుంది.
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ వయనాడ్ లోక్సభ బైపోల్లో ఘన విజయం సాధించారు. దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. సోదరుడు రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ, ఇండియా కూటమి నేతలను హేమంత్ ఆహ్వానించారు.
Bangladesh Political Crisis: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహ్మద్ యూనస్ గురువారం మధ్యాహ్నం 2:10 గంటలకు బంగ్లాదేశ్ చేరుకుంటారు.
బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ బుధవారం తెలిపారు.
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృతపాల్ సింగ్కు లోక్సభ స్పీకర్ శుభవార్త చెప్పారు. జూలై 5న (శుక్రవారం) ఎంపీగా అమృతపాల్ ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతి ఇచ్చారు.