Rohit Sharma: టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్కు దూసుకెళ్లింది. సూపర్-12లో ఉన్న అన్ని జట్లలో భారత్ ఖాతాలోనే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. నాలుగు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా 8 పాయింట్లతో టాపర్గా నిలిచింది. గ్రూప్-1లో టాపర్గా నిలిచిన న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కప్ మనదేనంటూ పలువురు టీమిండియా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రోహిత్ సెంటిమెంట్ టీమిండియాను ఊరిస్తోంది. ఎందుకంటే రోహిత్ కెప్టెన్గా చేసిన అన్ని ఫార్మాట్లలోనూ…
Team India: 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. 15 ఏళ్లు గడిచినా మరోసారి టీమిండియా మాత్రం మరోసారి టీ20 ప్రపంచకప్ను ముద్దాడలేకపోయింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లో మాత్రం భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే సెమీస్కు చేరిన రోహిత్ సేన ఇంగ్లండ్తో తలపడనుంది. సమష్టిగా ఆడితే ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్కు చేరడం అసాధ్యమేమీ కాదని అభిమానులు విశ్వసిస్తున్నారు. అటు తొలి సెమీస్లో న్యూజిలాండ్ను ఓడించి పాకిస్థాన్ ఫైనల్…
T20 World Cup: టీ20 వరల్డ్ కప్లో మెల్బోర్న్ వేదికగా జరిగిన నామమాత్ర మ్యాచ్లో పసికూన జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల టార్గెట్ బరిలోకి దిగిన జింబాబ్వేను భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్లోనే దెబ్బ కొట్టాడు. ఫస్ట్ బాల్కే మధెవెరేను వెనక్కి పంపాడు. తర్వాత జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి 115 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు…
South Africa: క్రికెట్లో దురదృష్టం వెంటాడే జట్టు ఏదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికా మాత్రమే. ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో అందరికంటే ముందు సెమీస్ చేరుతుందని భావించిన జట్టు దక్షిణాఫ్రికా. కానీ అనూహ్యంగా దక్షిణాఫ్రికా సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. బంగ్లాదేశ్పై భారీ విజయం, టీమిండియా అద్భుత గెలుపు చూసి దక్షిణాఫ్రికా సెమీస్కు వెళ్లడం లాంఛనమే అని అందరూ భావించారు. కానీ టోర్నీ ప్రారంభం, టోర్నీ ముగింపు ఆ జట్టు దురదృష్టాన్ని మరోసారి చాటిచెప్పాయి. సూపర్-12లో దక్షిణాఫ్రికా తన…
Afghanistan: టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్-12 దశలో ఆప్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే చివరి మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియాపై గెలిచినంత పనిచేసింది. చివరకు 4 పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. మెగా టోర్నీలో ఒక్క విజయం కూడా లేకుండా తమ జట్టు నిష్క్రమించడంతో ఆప్ఘనిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ నబీ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. జట్టు ఎంపికలో…
Team India: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో ఐసీసీ అండతోనే టీమిండియా విజయాలు సాధిస్తుందని ఆరోపించాడు. పాకిస్థాన్, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని షాహిద్ అఫ్రిది అన్నాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్తో వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్లో ఐసీసీ ఒత్తిడితోనే అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్నా.. అంపైర్లు మ్యాచ్ నిర్వహించారని విమర్శలు చేశాడు. ఎలాగైనా టీమిండియా సెమీస్కు వెళ్లాలనే ఆలోచనతోనే ఐసీసీ ఇలా…
T20 World Cup: టీ20 ప్రపంచకప్లో శుక్రవారం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో తప్పిదం జరిగింది. ఆప్ఘనిస్తాన్ బౌలర్ ఓవర్కు ఐదు బంతులే వేశాడు. కానీ ఈ విషయాన్ని అంపైర్లు గమనించలేదు. కానీ లైవ్లో మ్యాచ్ చూస్తున్న అభిమానులు మాత్రం ఈ తప్పిదాన్ని గుర్తించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా నాలుగో ఓవర్ను ఆప్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ వేశాడు. తొలి…
T20 World Cup: టీ20 ప్రపంచకప్లో సూపర్-12 దశలో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించని జట్టు ఆప్ఘనిస్తాన్ మాత్రమే. ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నా అవి వరుణుడి కారణంగా వచ్చాయి. అయితే తన చివరి లీగ్ మ్యాచ్లో ఆప్ఘనిస్తాన్ గెలిచినంత పని చేసింది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఈ జట్టు తుదికంటా పోరాడింది. కానీ తృటిలో విజయం చేజార్చుకుంది. 169 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్తాన్ 164 పరుగులు మాత్రమే…
T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. న్యూజిలాండ్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్ ఈ హ్యాట్రిక్ సాధించడం విశేషం. టీ20ల్లో అగ్రశ్రేణి జట్టు న్యూజిలాండ్పై పసికూన ఐర్లాండ్ జట్టు హ్యాట్రిక్ నమోదు చేయడం నిజంగా అద్భుతమే అని చెప్పాలి. ఈ మ్యాచ్లో తొలుత న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయగా 19వ ఓవర్లో జోష్ లిటిల్ బౌలింగ్కు దిగి వరుస బంతుల్లో కేన్ విలియమ్సన్, జేమ్స్ నీషమ్,…
T20 World Cup: టీ20 ప్రపంచకప్లో ఎట్టకేలకు సెమీస్ బెర్తులు ఖరారవుతున్నాయి. ఈ టోర్నీలోనే సెమీస్కు వెళ్లిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. శుక్రవారం నాడు గ్రూప్-1లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లు చేరాయి. ఇందులో మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దు ఉన్నాయి. 2.113 మెరుగైన రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్కు సెమీస్ బెర్తు ఖరారైంది. రెండో…