Team India: షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు.. ఐసీసీ వల్లే టీమిండియా గెలుస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో ఐసీసీ అండతోనే టీమిండియా విజయాలు సాధిస్తుందని ఆరోపించాడు. పాకిస్థాన్, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని షాహిద్ అఫ్రిది అన్నాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్తో వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్లో ఐసీసీ ఒత్తిడితోనే అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్నా.. అంపైర్లు మ్యాచ్ నిర్వహించారని విమర్శలు చేశాడు. ఎలాగైనా టీమిండియా సెమీస్కు వెళ్లాలనే ఆలోచనతోనే ఐసీసీ ఇలా వ్యవహరిస్తోందని అఫ్రిది తన అక్కసు వెళ్లగక్కాడు.
Read Also: Imran Khan: గతంలో బంగ్లాదేశ్లో జరిగిందే.. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతోంది.
Also Read
- Vaibhav Sooryavanshi: "ఇదే కరెక్ట్ టైమ్.. నిర్ణయం తీసుకోండి".. వైభవ్ సూర్యవంశీ విషయంలో రెచ్చిపోతున్న అభిమానులు
- Praggnanandhaa - Magnus Carlsen: వరల్డ్ నం.1 కార్ల్సెన్ కు 'ప్రజ్ఞానంద' చెక్మేట్.!
- Vaibhav Net Worth: "కోటీశ్వరుడే నండోయ్".. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?
- Vaibhav Sooryavanshi Records: బేబీ బాస్ బీభత్సం.. ఒక్క తుఫాన్ ఇన్నింగ్స్ తో వైభవ్ ఖాతాలోకి చేరిన రికార్డ్స్ ఇవే.!
అయితే టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత్ సాధించిన విజయం కారణంగానే అఫ్రిది ఇలా ఆరోపణలు చేస్తున్నాడని టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు కూడా ప్రమాదంలో పడటంతో టీమిండియా సాధించిన విజయాలను తక్కువ చేసేలా మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాగా బంగ్లాదేశ్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్ అనంతరం వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడం, ఫేక్ ఫీల్డింగ్ అంటూ బంగ్లాదేశ్ అభిమానులు, ఆటగాళ్లు కూడా ఆరోపణలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ అంశాన్ని సాకుగా తీసుకుని అఫ్రిది కూడా తన నోటికి పనిచెప్పాడు.
తాజావార్తలు
-
Suriya : ఆగస్టు 14న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ ఫిక్స్
-
TDP Mahanadu: మహానాడులో చంద్రబాబు కీలక తీర్మానం.. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలి..
-
Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
-
Karnataka Power Tussle: సీఎం పదవి నుంచి దిగిపోయేలా సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఒప్పించింది?
-
Siddaramaiah: “నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు”.. సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!