T20 World Cup: సెమీస్కు వెళ్లిన తొలి జట్టుగా న్యూజిలాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 ప్రపంచకప్లో ఎట్టకేలకు సెమీస్ బెర్తులు ఖరారవుతున్నాయి. ఈ టోర్నీలోనే సెమీస్కు వెళ్లిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. శుక్రవారం నాడు గ్రూప్-1లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లు చేరాయి. ఇందులో మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దు ఉన్నాయి. 2.113 మెరుగైన రన్ రేట్ కారణంగా న్యూజిలాండ్కు సెమీస్ బెర్తు ఖరారైంది. రెండో సెమీస్ బెర్త్ ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్కు దక్కనుంది. ప్రస్తుతం ఆ రెండు జట్ల ఖాతాలో చెరో 5 పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టు ఆశలన్నీ ఇంగ్లండ్-శ్రీలంక మ్యాచ్పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై శ్రీలంక గెలిస్తే ఆసీస్కు సెమీస్ బెర్త్ ఖరారవుతుంది.
Read Also: Twitter: చిక్కుల్లో ఎలాన్ మస్క్.. కోర్టులో పిటిషన్.. కారణం ఇదే..
Also Read
- Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
- Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
అలా కాకుండా ఇంగ్లండ్ విజయం సాధిస్తే మాత్రం మెరుగైన రన్రేట్ కారణంగా ఆ టీమ్ సెమీస్లోకి అడుగుపెడుతుంది. ఈ క్రమంలోనే శనివారం జరిగే మ్యాచ్లో ఇంగ్లండ్ను శ్రీలంక ఓడించాలని ఆస్ట్రేలియా అభిమానులు కోరుకుంటున్నారు. ఆప్ఘనిస్థాన్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా 100 పరుగులతో విజయం సాధిస్తే ఇంగ్లండ్ 47 పరుగులతో గెలవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా 80 పరుగులతో గెలిస్తే ఇంగ్లండ్ 29 పరుగులతో గెలవాలి. అదే ఆస్ట్రేలియా 50 పరుగులతో గెలిస్తే ఇంగ్లండ్ ఒక్క పరుగుతో గెలిచినా సరిపోతుంది. మరోవైపు గ్రూప్-2లో భారత్, దక్షిణాఫ్రికాకు సెమీస్కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సెమీస్ రేసులో పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. జింబాబ్వేపై భారత్, నెదర్లాండ్స్పై దక్షిణాఫ్రికా గెలిస్తే నేరుగా సెమీస్లోకి అడుగుపెడతాయి.
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!