టీ 20 ప్రపంచ కప్ 2021 టోర్నీ ముంగింపు దశకు చేరుకుంది. నిన్న మొదటి సెమీ ఫైనల్ జరుగగా… ఇవాళ రెండో సెమీ ఫైనల్ జరుగనుంది. ఈ రెండో సెమీస్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ దుబాయి లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుండగా… భారత కాలమానం ప్రకారం… సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుకే… కాస్త ఎడ్జ్ ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. జట్లు…
టీ-20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ ఫైనల్కు చేరుకుంది. తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఐసీసీ టోర్నీల్లో ఇంగ్లాండ్ గండం నుంచి కివీస్ బయపడినట్లైంది. టీ-20 వరల్డ్ కప్లో ఫైనల్కు చేరిన తొలిజట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్పై గెలుపొంది మొదటి సారి ఫైనల్కు దూసుకెళ్లింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లో నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లో మొయిన్ అలీ, డేవిడ్…
భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయంటే ప్రతి క్రికెట్ అభిమాని టీవీకి అతుక్కుపోవాల్సిందే. ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత దాయాది జట్లు సమరానికి దిగాయి. దీంతో టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. అక్టోబర్ 24న జరిగిన ఈ మ్యాచ్ను ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల 70 లక్షల మంది వీక్షించారట. ఈ విషయాన్ని స్వయంగా ఈ మ్యాచ్ ప్రసారం చేసిన స్టార్ నెట్వర్క్ తెలియజేసింది. Read Also: కెప్టెన్గా రోహిత్…
టీ20 ప్రపంచకప్లో లీగ్ మ్యాచ్లు ముగిశాయి. ఇక నాకౌట్ మ్యాచ్ల సమరం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఈరోజు జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో హోరాహోరీగా తలపడిన సంగతి ఇంకా క్రికెట్ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. ఆనాడు జరిగిన నాటకీయ పోరులో సాంకేతికంగా ఇంగ్లండ్ విజేతగా నిలిచినా.. న్యూజిలాండ్ కూడా అద్భుతంగా పోరాడి అభిమానుల మనసులను దోచుకుంది. అబుదాబీ వేదికగా జరగనున్న…
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి దిగిపోవడంపై స్పందించారు. ఈ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ నాయకత్వ మనేది గౌరవమని, నాయకత్వం మరొకరి ఒప్పగించడంతో ఉపశమ నం లభించిందన్నారు. గతకొంత కాలంగా విరామం లేని క్రికెట్ ఆడు తున్నామని విరాట్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్గా తన ఆఖ రి మ్యాచ్లో ఎందుకు బ్యాటింగ్ చేయలేదో వివరించాడు. నా పని భా రం పర్యవేక్షించుకునేందుకు ఇదే సరైన సమయమనిపించింది, ఆరే డేళ్లుగా ఎక్కువ పనిభారం పనిభారం…
టీ20 ప్రపంచకప్తో టీమిండియా కోచ్గా రవిశాస్త్రి పదవీ కాలం ముగిసింది. అయితే ఎన్నో ఆశలతో టీ20 ప్రపంచకప్లోకి అడుగుపెట్టిన టీమిండియా అభిమానులను మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. పాకిస్థాన్, న్యూజిలాండ్తో ఆడిన మ్యాచ్లలో భారత ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ప్రపంచ కప్ ఆశలు ఆవిరయ్యాయి. అయితే భారత్ వైఫల్యానికి గల కారణాలపై రవిశాస్త్రి స్పందించాడు. ఆటగాళ్లు కేవలం మనుషులు మాత్రమే అని.. వాళ్లు యంత్రాలు కాదు అని పేర్కొన్నాడు. యంత్రాలలో పెట్రోల్ పోసి నడపొచ్చు.. కానీ మనుషులతో…
భారత టీ-20 కెప్టెన్గా విరాట్ కోహ్లీ కథ ముగిసింది. ఎన్నో విజయాలు, మరెన్నో సిరీస్లు భారత్కు అందించి అత్యుత్తమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ.. తన చిరకాల కోరికైన టీ-20 వరల్డ్ కప్ సాధించకుండానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్ అనంతరం పొట్టి ఫార్మాట్ సారథ్యానికి గుడ్బై చెప్పాడు. ఈ సమయంలో ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు కోహ్లీ. ఏదో సాధించలేకపోయామన్న బాధ, నిర్వేదంలో విరాట్లో కనిపించింది. బ్యాట్స్మన్గా సూపర్ సక్సెస్ అందుకున్న కోహ్లి…
టీ20 ప్రపంచకప్ను టీమిండియా విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్లలో ఓడిపోయిన భారత్.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీకి వీడ్కోలు పలికింది. సారథిగా విరాట్ కోహ్లీకి ప్రపంచకప్ అందించలేకపోయిన ఆటగాళ్లు.. కెప్టెన్గా అతడి ఆఖరి మ్యాచ్లో మాత్రం గెలిచి విజయాన్ని కానుకగా అందించారు. నమీబియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. Read Also: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అదిరే రికార్డు ఈ మ్యాచ్లో కోహ్లీ సేన టాస్ గెలిచి…
టీ20 వరల్డ్ కప్లో భాగంగా జరుగుతున్న నమీబియాతో ఆడుతున్న మ్యాచ్లో టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫీట్ను సాధించాడు. అంతర్జాతీయT20 క్రికెట్లో 3వేలకు పైగా పరుగులను సాధించిన మూడో ప్లేయర్గా నిలిచాడు.రోహిత్ ఈ మ్యాచ్లో 37 బంతుల్లో 56(7 ఫోర్లు, 2సిక్స్లు) పరుగులు చేశాడు. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ ఎంపిక చేసే అవకాశలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 108 ఇన్నింగ్స్లో ఈ ఘనత…
ఈరోజు యావత్ భారతం అప్ఘనిస్తాన్ వైపు నిలబడనుంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్లో భారత్ సెమీస్ అవకాశాలు ఆ జట్టు చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్ఘనిస్తాన్ జట్టుపై భారత ఆటగాళ్లు, పలువురు నెటిజన్లు తెగ మీమ్స్ షేర్ చేస్తున్నారు. టాలీవుడ్ సినిమాల్లోని ఫైట్ సీన్లకు డైలాగులు జోడిస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఈ మీమ్స్లో రషీద్ ఖాన్పై చేసిన మీమ్ తెగ ఆకట్టుకుంటోంది. ధోనీ, కోహ్లీ, రోహిత్ కలిసి రషీద్ ఖాన్ జుట్టు దువ్వుతున్న ఫోటో ఫన్నీగా ఉంది.