ఇంగ్లండ్ Vs న్యూజిలాండ్: నాడు ఫైనల్ .. నేడు సెమీఫైనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్లో లీగ్ మ్యాచ్లు ముగిశాయి. ఇక నాకౌట్ మ్యాచ్ల సమరం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఈరోజు జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో హోరాహోరీగా తలపడిన సంగతి ఇంకా క్రికెట్ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. ఆనాడు జరిగిన నాటకీయ పోరులో సాంకేతికంగా ఇంగ్లండ్ విజేతగా నిలిచినా.. న్యూజిలాండ్ కూడా అద్భుతంగా పోరాడి అభిమానుల మనసులను దోచుకుంది.
అబుదాబీ వేదికగా జరగనున్న తొలి సెమీఫైనల్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు గ్రూప్ స్టేజీలో ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగు గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయాయి. గ్రూప్-1లో ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాపై ఓటమి చెందగా.. గ్రూప్-2లో న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పటికే ఓ సారి టీ20 ప్రపంచకప్ అందుకున్న ఇంగ్లండ్ జట్టు రెండోసారి కప్పును ముద్దాడాలంటే కివీస్తో అద్భుతంగా ఆడాల్సిందే. అయితే ఆ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఓపెనర్ జాసన్ రాయ్ గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. పేసర్ టైమల్ మిల్స్ తొడకండరాల గాయంతో దూరమయ్యాడు. బట్లర్, మలాన్, బెయిర్ స్టో, మోర్గాన్, మొయిన్ అలీలతో బ్యాటింగ్ విభాగం బాగానే కనిపిస్తున్నా.. మార్క్ వుడ్, జోర్డాన్, వోక్స్ బౌలింగ్లో ఎంతమేరకు రాణిస్తారనే విషయంపైనే ఇంగ్లండ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
Read Also: టీమిండియా ఆటగాళ్లు రెండు గ్రూపులుగా విడిపోయారా?
మరోవైపు న్యూజిలాండ్ తొలిసారి ఐసీసీ టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. వన్డే వరల్డ్ కప్లో తమకు జరిగిన పరాభవానికి ఇంగ్లండ్పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఆ జట్టు ముఖ్యంగా పేసర్లపైనే ఆధారపడి ఉంది. ఈ టోర్నీలో బౌల్ట్, మిల్నే, సౌథీ, సోధీ, శాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. బ్యాటింగ్లో కూడా గప్తిల్, మిచెల్, విలియమ్సన్, కాన్వే, ఫిలిప్స్లతో బలంగానే కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!