టీ20 ప్రపంచకప్: ఈసారి కొత్త ఛాంపియన్ షురూ
టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. సెమీఫైనల్ మ్యాచ్లు ముగిశాయి. తొలి సెమీస్లో ఇంగ్లండ్పై న్యూజిలాండ్, రెండో సెమీస్లో పాకిస్థాన్పై ఆస్ట్రేలియా విజయం సాధించడంతో ఈనెల 14న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. దీంతో ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించడం షురూ అయ్యింది. గురువారం రాత్రి జరిగిన రెండో సెమీస్లో పాకిస్థాన్ను 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మట్టికరిపించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రిజ్వాన్ (67), బాబర్ ఆజమ్ (39), జమాన్ (55 నాటౌట్) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్కు రెండు వికెట్లు దక్కగా.. జంపా, కమిన్స్ చెరో వికెట్ సాధించారు.
Read Also: మరో కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బాబర్ ఆజమ్
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
అనంతరం 177 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఫించ్ డకౌటయ్యాడు. వార్నర్ (49), మిచెల్ మార్ష్ (28) దూకుడుగా ఆడటంతో ఆసీస్ 6 ఓవర్లలో 52 పరుగులు చేసింది. కానీ పాక్ బౌలర్ షాదాబ్ ఖాన్ విజృంభించి మార్ష్, స్మిత్ (5) వికెట్లు తీయడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. మ్యాక్స్ వెల్ (7), వార్నర్ కూడా వారిని అనుసరించడంతో 16 ఓవర్లకు ఆసీస్ 127/5తో కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. చివరి 4 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సిన స్థితిలో స్టాయినీస్ (40 నాటౌట్), మాథ్యూ వేడ్ (41 నాటౌట్) మెరుపు బ్యాటింగ్ చేశారు. షహీన్ షా అఫ్రిది వేసిన 19వ ఓవర్లో వేడ్ వరుసగా మూడు సిక్సర్లు బాదడంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వేడ్కు లభించింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో