టీ20 వరల్డ్ కప్లో భాగంగా జరుగుతున్న నమీబియాతో ఆడుతున్న మ్యాచ్లో టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫీట్ను సాధించాడు. అంతర్జాతీయT20 క్రికెట్లో 3వేలకు పైగా పరుగులను సాధించిన మూడో ప్లేయర్గా నిలిచాడు.రోహిత్ ఈ మ్యాచ్లో 37 బంతుల్లో 56(7 ఫోర్లు, 2సిక్స్లు) పరుగులు చేశాడు.
టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో అతని స్థానంలో రోహిత్ శర్మ ఎంపిక చేసే అవకాశలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 108 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు హిట్ మ్యాన్. ఇక రోహిత్ కన్నా ముందు విరాట్ కోహ్లీ- 3,227 మార్టిన్గప్తీల్ (న్యూజిలాండ్)- 3115, మాత్రమే ఈ రికార్డును అందుకున్నారు. ఇక టీ20లలో నాలు గు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ నిలిచాడు.