దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ముప్పు తిప్పలు పెడుతోంది. స్వచ్ఛమైన గాలి లేక నరకయాతన పడుతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. నగర వాసులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇంకోవైపు పార్లమెంట్ వేదికగా విపక్ష నాయకులు కూడా పోరాటం చేస్తున్నారు. అయినా కూడా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.
స్టాండప్ కమెడియన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. దివ్యాంగులపై షోల్లో జోక్లు వేయడంపై తీవ్రంగా తప్పుపట్టింది. తక్షణమే సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. జరిమానాలు కూడా తప్పవని హెచ్చరించింది.