ప్రముఖ తెలుగు యాంకర్ వర్షిణిపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెసెంట్ ఐపీఎల్ సీజన్లో వర్షిణి స్టేడియంకు వచ్చిన ప్రతిసారి (3 సార్లు) హైదరాబాద్ జట్టు ఓటమిపాలు కావడంతో ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 16వ ఎడిషన్ ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతుంది. టోర్నీలో 52వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ పోటీపడనున్నాయి. జైపూర్ వేదికగా ఇవాళ (ఆదివారం) రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో రాజస్థాన్ని సంజూ శామ్సన్, హైదరాబాద్ని ఐడెన్ మార్క్రామ్ సారథులుగా వ్యవహరిస్తున్నారు.