హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పెళ్లికి పెద్దలు నిరాకరించారనీ ఆత్మహత్య యత్నం చేసింది జంట. అయితే ప్రియురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రియుడు గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఒంగోలు కు చెందిన నాగ చైతన్య , కోటి రెడ్డి ప్రేమించుకున్నారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తోంది నాగ చైతన్య. మెడికల్ రెప్రజెంటేటివ్ గా చేస్తున్నాడు కోటి రెడ్డి. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు…
సినిమా ఆర్టిస్ట్ సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… సైద్ రహీమ్ అనే 24 ఏళ్ళ యువకుడు సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు. పలు సినిమాల్లో నటించిన సైద్ తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.…
రోజురోజుకు ప్రజల మానసిక స్థితి ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే ఇది.. హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీకి చెందిన ఓ మహిళ తన తండ్రి మందలించడంతో ఉసురుతీసుకుంది. మమత అనే మహిళ తన తల్లిదండ్రులతో కేపీహెచ్ బీ కాలనీలో నివాసం ఉంటోంది. మమత కు 2019 వివాహం జరిగింది. అయితే భర్తకు కాన్సర్ ఉందని తెలియడంతో రెండు నెలలకే విడాకులు…
తిరుపతిలోని శ్రీకాళహస్తిలో వాలంటీర్ చందన ఆత్మహత్యకు పాల్పడింది.. రైలు నుంచి దూకి రెండేళ్ల కుమారుడితో పాటు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఆమె రైలు పట్టాలపై విగతజీవిగా మారింది. తిరుపతి నుంచి నెల్లూరు మార్గంలో రైలు కింద పడి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాళహస్తి రూరల్ మండలం అక్కుర్తి గ్రామం వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈఘటనకు సంబందించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.…
ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని ఎంత హెచ్చరిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆన్ లైన్ గేమ్స్ మోజులో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. చెన్నైలోని కృష్ణగిరి జిల్లా హోసూరులో మోహన్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. అయితే మోహన్ కు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడడం అలవాటుగా మారింది. ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ..అందులో…
సోషల్ మీడియా మోజులో పడి భార్య తనను పట్టించుకోలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్లోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫతేనగర్కు చెందిన మౌనిక పదే పదే వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తోంది. దాంతో వీడియోలు అప్లోడ్ చేయొద్దని భర్త పవన్ కోరాడు. అయినా పట్టించుకోకపోవడంతో.. భార్య ప్రవర్తనతో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్ నగర్లోని ఫతేనగర్కు చెందిన పవన్ కు మౌలాలికి చెందిన మౌనికతో 2015లో వివాహం జరిగింది. మొదట…
రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ లో విషాదం చోటు చేసుకుంది. భార్య తనతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్ అనే వ్యక్తి. ఇంట్లో తన గది లో ఫ్యాన్ కు తాడుతో ఉరి వేసుకొని బలవన్మరణంకు పాల్పడ్డాడు శ్రీకాంత్.ఉదయం ఎంతకీ శ్రీకాంత్ ఇంట్లో నుండి బయటకు రాకపోవడంతో అనుమానం తో కిటికీ తెరచి చూసిన స్థానికులకు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు శ్రీకాంత్. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.…
రాజేంద్రనగర్ శివరాంపల్లి లో విషాదం చోటు చేసుకుంది. నేషనల్ పోలీస్ అకాడమీలో పని చేస్తున్న కానిస్టేబుల్ వాసు ఆత్మహత్య చేసుకున్నాడు. శివరాంపల్లి రెడ్డి బస్తీలో నివాసం వుంటున్న వాసు తన గది లో ఫ్యాన్ కు ఊరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి తన గది లోకి వెళ్లి ఆత్మహత్య కు చేసుకున్నాడువాసు. అయితే ఉదయం గది నుండి ఎంతకీ బయటకు రాకపోవడంతో కంగారు పడ్డ భార్య… గట్టిగా కేకలు వేస్తూ బోరున విలపిస్తుండగా వాసు ఇంటికి…
కర్నూలులో ఓ దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన ప్రతాప్, వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక, తానుకూడా విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలో ప్రతాప్ టీవీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. మానసిక కుంగుబాటుతోనే ప్రతాప్ ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మాహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకోన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కుక్కపిల్ల కొనివ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖలోని వెంకటేశ్వర మెట్ట ప్రాంతానికి చెందిన షణ్ముక వంశీ (16) సూసైడ్ తో ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయాడు. ఇటీవలే ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ జాయిన్ అయిన వంశీ.. ఆన్లైన్లో చూసిన రూ.30వేల విలువైన కుక్కపిల్ల కావాలని తల్లిని అడిగాడు. కొన్నిరోజుల తర్వాత కొందామని చెప్పిన వినకుండా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా.. విశాఖ కేజీహెచ్కు తరలించగా…