Delhi : ఢిల్లీలోని రంగపురి ప్రాంతంలో ఓ తండ్రి తన నలుగురు కూతుళ్లతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. 50 ఏళ్ల హీరా లాల్ తన కుటుంబంతో కలిసి రంగ్పురి ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించాడు.
ఆర్థికంగాను, స్థలం విషయంలోనూ స్నేహితులు మోసానికి పాల్పడ్డారని మనస్తాపం చెంది, తన చావుకు స్నేహితులు కారణమని సెల్ఫీ వీడియో తీసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల మందమర్రికి చెందిన రాజేష్(32) మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లో తన భార్య కుష్మల తో కలిసి నివసిస్తూ, ఐటి కన్సల్టెన్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఓ స్థలం విషయమై మాట్లాడేందుకు వెళ్తున్నానని…
Suicide Pod: స్విట్జర్లాండ్లో 64 ఏళ్ల అమెరికన్ మహిళ ‘సూసైడ్ పాడ్’ ఉపయోగించి ఆత్మహత్య చేసుకుంది. ప్రపంచంలో అలా చేసిన మొదటి వ్యక్తి ఆమె. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలకే ఆత్మహత్యకు సహకరించారనే అనుమానంతో, అనేక మందిని అరెస్టు చేశారు అధికారులు. ఈ సూసైడ్ క్యాప్సూల్ ఇంతకు ముందెన్నడూ ఉపయోగించబడలేదు. అందిన సమాచారం ప్రకారం, ఈ సూసైడ్ క్యాప్సూల్ను సోమవారం మొదటిసారి ఉపయోగించారు. ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్నామని, ఆత్మహత్యకు సహకరించారనే అనుమానంతో ప్రాసిక్యూటర్లు…
మహారాష్ట్ర పూణేలోని చర్హోలీ గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చనిపోయిన కొద్ది రోజులకు తిరిగి వచ్చాడు. చనిపోయిన వ్యక్తి ఎలా వచ్చాడు? అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం.. పూణేలోని చర్హోలీ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పొలంలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ మృతదేహం పొలాలు దున్నేందుకు ఉపయోగించే రోటావేటర్లో ఇరుక్కుపోయి ఛిద్రమైంది. మొండెం పైనుంచి తల కూడా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దుస్తులను గుర్తించగా మృతదేహం…
నోయిడాలోని రబుపురా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం ఆయన తన భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతుండగా గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మహ్మద్పూర్ గ్రామం సమీపంలో పోలీస్ స్టేషన్ జీపులో ప్రభుత్వ పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు
అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్లో ఓ యువకుడు గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
యూపీలోని ఇటావాలో అత్తమామల వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. అత్తమామల వేధింపులతో విసిగిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను వ్యక్తం చేశాడు. తన కుటుంబానికి సాయం చేయాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివపాల్ సింగ్, డీఎంలకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
యూపీలోని మీరట్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని బాయ్ఫ్రెండ్ ఆత్మహత్యకు కారణమని, విద్యార్థినిని మోసపూరితంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వీడియో విద్యార్థి కుటుంబ సభ్యులకు చేరడంతో తీవ్ర మనస్తాపంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలోని పితంపుర మెట్రో స్టేషన్లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కదులుతున్న మెట్రో ముందు దూకింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.