ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్యపై నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కాలేజీ లెక్చరర్ వేధింపులకు తాళలేక 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం బీజేడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు.
Odisha Student: తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒడిశాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని మృతి చెందింది. బాలాసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని భువనేశ్వర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మరణించింది. తీవ్రమైన కాలిన గాయాలతో జూలై 12న క్యాజువల్టీకి తీసుకువచ్చారు, అక్కడే ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. కాలేజ్ ప్రొఫెసర్ నుంచి సుదీర్ఘ లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థిని, తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య…
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య ఘటన చోటు చేసుకున్న ఘటన రాజానగరం గైట్ కాలేజీల్లో కలకలం సృష్టించింది.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గైట్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ చదువుతోన్న బీటెక్ విద్యార్థిని పరుచూరి ప్రగతి (19) కాలేజీ హాస్టల్ లో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
UPSC Aspirant Suicide: ‘‘ఎవరూ ఐఏఎస్ ఊరికే అవరు. ఇప్పుడే మీరు నిద్ర నుంచి మేల్కొని చదవాలి’’ అంటూ గది గోడలపై ఎన్నో ఇలాంటి మోటివేషనల్ కోట్స్ ఉన్నాయి. అయినా కూడా, పదే పదే వైఫల్యాల కారణంగా, ఒత్తిడిని ఎదుర్కోలేక ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్కి చెందిన ఆశా ఉయ్కే(25) తన జీవితాన్ని ముగించింది.
10th Results : హైదరాబాద్ నగరంలోని అల్వాల్, వెస్ట్ వెంకటాపురంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్షల్లో విఫలమవుతాననే భయం ఓ లేత ప్రాణాన్ని బలితీసుకుంది. వర్గల్ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న సంజయ్ కుమార్ (15), ఫలితాల వెల్లడికి ముందే తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఇటీవలే టెన్త్ పరీక్షలు ముగియడంతో సంజయ్ సెలవుల కోసం ఇంటికి వచ్చాడు. అయితే, మరో రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయనే వార్త అతని మనసులో భయాన్ని నింపింది. స్నేహితులు…
క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. డబ్బులు అధికంగా వస్తాయన్న ఆశతో బెట్టింగ్లో పాల్గొన్న యువకుడు చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన కడప జిల్లా బుద్వేల్లో విషాదాన్ని నెలకొల్పింది. బుద్వేల్కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లలో బెట్టింగ్కు లోనయ్యాడు. మొదట్లో స్వల్ప లాభాలు రావడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అంటే సుమారు 80 వేలు బెట్టింగ్ పెట్టాడు. అయితే..…
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదనే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న చిన్న మస్తాన్ అనే విద్యార్థి ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యాడు.
Student Suicide: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో గల ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పేరు గత కొంత కాలం నుంచి మారుమ్రోగుతుంది. తాజాగా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ లో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కమర్హతిలోని ఈఎస్ఐ క్వార్టర్స్ లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Palnadu: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నేహితురాలితో ఏర్పడిన స్వల్ప వివాదంతో ఓ స్టూడెంట్ భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది.
నెల్లూరు జిల్లాలోని నారాయణ వైద్య కళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనం పైనుంచి దూకి ప్రదీప్ సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది.