Home
Student Suicide
Student Suicide News
-
Visakhapatnam: లైంగిక వేధింపులతో డిగ్రీ స్టూడెంట్ మృతి.. విద్యార్థి సంఘాల ఆందోళన
Visakhapatnam: విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల బారిన పడి డిగ్రీ విద్యార్థి సాయి తేజ మృతి చెందడం కలకలం రేపుతుంది. ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థి మృదేహానికి నేడు పోస్టుమార్టం చేయనున్నారు. -
Maharastra: ఎంబీబీఎస్ చదవడం ఇష్టంలేక స్టూడెంట్ ఆత్మహత్య
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ చదవడం ఇష్టం లేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ లో 99.99 పర్సంటేజ్ సాధించిన యువకుడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే… చంద్రాపూర్లోని నవర్గావ్కు చెందిన అనురాగ్ అనిల్ బొర్కర్ (19) ఇటీవల నీట్ ఎగ్జామ్లో 99.99 శాతం ఉత్తీర్ణత సాధించాడు. అయినప్పటికి అతడికి ఎంబీబీఎస్ చదవడం ఇష్టంలేక ప్రాణాలు తీసుకున్నాడు. యువకుడికి ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్పూర్లోని… -
Police Arrest: బీటెక్ విద్యార్థి జాదవ్ సాయి తేజ ఆత్మహత్య కేసులో ఐదుగురు అరెస్ట్
Police Arrest:హైదరాబాద్లోని ఓ ప్రవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న జాదవ్ సాయి తేజ (19) సీనియర్ విద్యార్థుల రాగింగ్, వేధింపులకు విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మేడిపల్లిలో ఉన్న మధు బాయ్స్ హాస్టల్లో తన గదిలో ఉరివేసుకొని సాయి తేజ ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్య ముందురోజు సీనియర్లు అతన్ని మద్యం తాగమని ఒత్తిడి చేసి, బార్కు తీసుకెళ్లారని.. అక్కడ రూ. 10,000 బిల్ కట్టమని మరింత ఒత్తిడి చేసి, బెదిరించారు. ఈ వేధింపులతో… -
Suicide : KPHBలో విషాదం.. 17వ అంతస్తు నుండి దూకి అమ్మాయి ఆత్మహత్య
Suicide : హైదరాబాద్ నగరంలోని కేపిహెచ్బీ కాలనీలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే 9వ తరగతి విద్యార్థిని లాస్య ప్రియ (13) బాత్రూం కిటికీ నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే, మంజీరా ట్రినిటీ హోమ్స్లో 17వ అంతస్తులో నివాసముండే హరినారాయణమూర్తి కుటుంబానికి చెందిన లాస్య ప్రియ, అడ్డగుట్టలోని నారాయణ స్కూల్లో చదువుతోంది. సోమవారం జరిగిన పేరెంట్-టీచర్ మీటింగ్లో విద్యాభ్యాసంపై తగిన శ్రద్ధ చూపడంలేదని టీచర్లు తల్లిదండ్రులకు సూచించారు. దీని తర్వాత ఆమె… -
Tragedy : మియాపూర్ లో విషాదం.. భవనం పై నుండి దూకి 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
Tragedy : హైదరాబాద్ నగరంలోని మియాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని హన్సిక (14) ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులు, స్నేహితులను మృదువుగా కలిచివేసింది. ఈ ఘటన మియాపూర్లోని జనప్రియ అపార్ట్మెంట్స్లో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, హన్సిక ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం సమయంలో ఆ బాలిక అపార్ట్మెంట్ భవనం పై నుండి దూకింది. Luxury Cars Tax Penalty: అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్… -
Odisha: విద్యార్థిని ఆత్మహత్యపై ఉవ్వెత్తిన నిరసన జ్వాలలు.. టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి ప్రయోగం
ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్యపై నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కాలేజీ లెక్చరర్ వేధింపులకు తాళలేక 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం బీజేడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. -
Odisha Student: లైంగిక వేధింపుల కారణంగా, నిప్పంటించుకున్న ఒడిశా విద్యార్థిని మృతి..
Odisha Student: తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒడిశాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని మృతి చెందింది. బాలాసోర్లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని భువనేశ్వర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మరణించింది. తీవ్రమైన కాలిన గాయాలతో జూలై 12న క్యాజువల్టీకి తీసుకువచ్చారు, అక్కడే ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. కాలేజ్ ప్రొఫెసర్ నుంచి సుదీర్ఘ లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థిని, తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య… -
AP Crime: హాస్టల్లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య ఘటన చోటు చేసుకున్న ఘటన రాజానగరం గైట్ కాలేజీల్లో కలకలం సృష్టించింది.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గైట్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ చదువుతోన్న బీటెక్ విద్యార్థిని పరుచూరి ప్రగతి (19) కాలేజీ హాస్టల్ లో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. -
UPSC Aspirant Suicide: వైఫల్యాల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న సివిల్స్ అభ్యర్థి..
UPSC Aspirant Suicide: ‘‘ఎవరూ ఐఏఎస్ ఊరికే అవరు. ఇప్పుడే మీరు నిద్ర నుంచి మేల్కొని చదవాలి’’ అంటూ గది గోడలపై ఎన్నో ఇలాంటి మోటివేషనల్ కోట్స్ ఉన్నాయి. అయినా కూడా, పదే పదే వైఫల్యాల కారణంగా, ఒత్తిడిని ఎదుర్కోలేక ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్కి చెందిన ఆశా ఉయ్కే(25) తన జీవితాన్ని ముగించింది. -
10th Results : ఎంత పనిచేశావ్ చిన్నా.. రిజల్ట్కు భయపడి ఉరేసుకున్న విద్యార్థి
10th Results : హైదరాబాద్ నగరంలోని అల్వాల్, వెస్ట్ వెంకటాపురంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్షల్లో విఫలమవుతాననే భయం ఓ లేత ప్రాణాన్ని బలితీసుకుంది. వర్గల్ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న సంజయ్ కుమార్ (15), ఫలితాల వెల్లడికి ముందే తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఇటీవలే టెన్త్ పరీక్షలు ముగియడంతో సంజయ్ సెలవుల కోసం ఇంటికి వచ్చాడు. అయితే, మరో రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయనే వార్త అతని మనసులో భయాన్ని నింపింది. స్నేహితులు…
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!