గతంలో అబ్బాయికి 21, అమ్మాయికి 18 వచ్చిందంటే పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు 30 ఏళ్లు దాటిన అమ్మాయిలు, 35 దాటిన అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. గతంలో పెళ్లిళ్లకు కుటుంబసమేతంగా హాజరయ్యేవారు. పెళ్లిళ్లలోనే అమ్మాయిని చూసి, పెళ్లి విషయాలు మాట్లాడుకుని వివాహాలు జరిపించేవారు. కానీ నేడు పెళ్లళ్లకు ఇంటికొకరు మాత్రమే హడావుడిగా రిసెప్షన్కు వచ్చి వెళ్లిపోతున్నారు.
కథలు బాగా రాయాలంటే బాగా పుస్తకాలు చదవాలి అంటారు. అంతకు మించి లోకాన్నీ చదవాలంటారు. అప్పుడే జన ‘నాడి’ తెలుస్తుందనీ చెబుతారు. ఆకట్టుకొనే రచనలు సాగించవచ్చుననీ పెద్దలు తెలిపారు. ఇదే సూత్రం సినిమాల చిత్రీకరణకూ వర్తిస్తుందని పలువురి అభిప్రాయం! పలు దేశవిదేశీ చిత్రాలు చూస్తోంటే, లోకం తీరు తెలుస్తుంది. అలాగే మన చుట్టూ ఉన్న లోకాన్ని పరిశీలిస్తే జనాల అభిరుచీ అవగతమవుతుంది. ఆ పనిచేశాకే సినిమాలు తీస్తే బాగుంటుందని పరిశీలకులు ఏ నాటి నుంచో అంటూనే ఉన్నారు.…