ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా? అంటే కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కేసులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.. సిక్కోలులో పాజిటివిటీ రేటు మళ్లీ పెరుగుతుండటంతో అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటుందనుకుంటున్న వేళ కేసులు పెరగడం శ్రీకాకుళం జిల్లాలో కొత్త కలవరాన్ని పుట్టిస్తోంది. సరిగ్గా 4నెలల క్రితం రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో ఒకటిగా ఉన్న శ్రీకాకుళం.. ఆ తర్వాత కఠినమైన లాక్డౌన్ నిబంధనలతో వైరస్ను నిలువరించింది. అయితే, మొన్నటి వరకూ…
లవ్వర్ కు గిఫ్ట్ ఇచ్చేందుకే దొంగగా మారాడు ఓ యువకుడు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో నిన్న జి.కె జ్యూవెలరీలో ఒడిశాకు చెందిన సూరజ్ కుమార్ కద్రకా చోరీకి పాల్పడ్డాడు. జ్యూవెలరీ షాప్ లోని వర్కర్స్ ను డమ్మీ పిస్తోల్ తో బెదిరించి మూడు గోల్డ్ చెయిన్స్ చోరీ చేశాడు. చోరీ చేసి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని.. పోలీసులకు అప్పగించారు. పోలీస్ విచారణలో లవ్వర్ కు గిఫ్ట్ ఇచ్చేందుకే చోరీ చేశానని సూరజ్ కుమార్ అంగీకరించాడు. చోరీ కోసం…
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీకాకుళం లో మాట్లాడుతూ… నేను బీజేపీ కార్యకర్తగా మాట్లాడుతున్నా. బీజేపీ అధికారంలోకి రాకముందు నేను అన్ని జిల్లాలు తిరిగాను. మేనిఫెస్టో కమిటీలో పనిచేశాను. ప్రతీ రాష్ట్రంలోనూ వెనుకబడిన జిల్లాలున్నాయి. దేశవ్యాప్తంగా 114 జిల్లాలను యాస్పిరేషన్ జిల్లాలుగా ప్రకటించారు. విజయనగరం జిల్లా సంస్కృతికి , సంప్రదాయాలకు పుట్టినిల్లు. కానీ నేటికీ విజయనగరం జిల్లా వెనుకబడే ఉంది అని అన్నారు. ఇది మన ప్రభుత్వ వైఫల్యం కాదు. మన పార్టీ వైఫల్యం అని…
ఆయన ఎన్నికల్లో గెలవలేదు. పార్టీ అధికారంలోకి రావడంతో ఇంఛార్జ్ హోదాలో నియోజకవర్గంలో పెత్తనం ఆయనదే. చేతిలో పవర్ ఉన్నా కాలం కలిసిరావడం లేదట. మెతకగా ఉంటున్నారని అలుసుగా తీసుకున్నారో ఏమో.. అంతా ఆయన పేరును వాడేసుకుంటున్నారట. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు గగ్గోలు పెడుతున్నారు ఆ ఇంఛార్జ్. సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు! అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి వచ్చిన రెండు సీట్లలో ఇచ్ఛాపురం ఒకటి. బెందాళం అశోక్ గెలిచినా.. ఆయనపై ఓడిన వైసీపీ…
గత నెల 25న జరిగిన హత్యకేసును శ్రీకాకుళం పోలీసులు చేధించారు. శ్రీకాకుళం టౌన్ సమీపంలోని విజయాదిత్య పార్క్ లో హత్యకు గురయ్యాడు మాజీ ఆర్మీ ఉద్యోగి చౌదరి మల్లేశ్వరరావు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విభేదాలే హత్యకు కారణమని తేల్చారు పోలీసులు. మల్లేశ్వరరావును హతమార్చాడు సొంత బావమరిది సీపాన అప్పలనాయుడు. విజయాదిత్య పార్క్ కు పిలిపించి మరో ఐదుగురితో కలిసి హత్య చేసాడు అప్పలనాయుడు. ఈ హత్యకు ఆరులక్షల ఒప్పందం చేసాడు. ముందుగా 4 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు.…
రాజకీయాల్లో విమర్శలు కామన్. కొందరు శ్రుతిమించి మాటల తూటాలు పేలుస్తారు. ఇంకొందరు హద్దేలేదన్నట్టుగా వాగ్భాణాలు సంధిస్తారు. ఈ విషయంలో ఆ మామా అలుళ్లు ఆరితేరిన వారే. కాకపోతే అల్లుడు దూకుడుగా వెళ్తుంటే.. మామా స్పీడ్ తగ్గించారట. దాంతో మామకు ఏమైంది అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. వారెవరో ఈస్టోరీలో చూద్దాం. 2014 నుంచి ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం శ్రీకాకుళం జిల్లాలో ఫ్యామిలీ పాలిటిక్స్కు కేరాఫ్ అడ్రసైన ఆమదాలవలసలో.. మామా అల్లుళ్ల మాటల యుద్ధం పీక్స్కు చేరుకున్న…
ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంపై శీతకన్ను వేశారు ఒకరు. పార్టీ బలోపేతం కోసం అక్కడ గేర్ మార్చారు ఇంకొకరు. అదే అక్కడ కొత్త చర్చకు దారితీసింది. నాయకత్వాన్ని మార్చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అనుకున్నారో ఏమో… అంతా కలిసి ఐక్యతా రాగం ఆలపించారు. మరి… కేడర్కు క్లారిటీ వచ్చినట్టేనా? టీడీపీలో చర్చకు దారితీసిన ఆ ఎపిసోడ్ను ఇప్పుడు చూద్దాం. పలాసపై ఎంపీ రామ్మోహన్నాయుడు స్పెషల్ ఫోకస్! శ్రీకాకుళం జిల్లా పలాస. 2019 ఎన్నికల్లో టీడీపీ…
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్కు సవాల్ విసిరారు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. హైరాబాద్లో ఉండి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేయడం కాదు.. చంద్రబాబుకు సిగ్గుంటే ఇప్పటికైనా రాష్ట్రానికి రావాలని డిమాండ్ చేశారు. ఇక్కడున్న వైద్య సదుపాయాలు పరిశీలిస్తే నీకే తెలుస్తుందని హితవుపలికారు.. నీ హయాంలో వైద్య సౌకర్యాలను ఎంత సంకనాకించేశావో మాకు తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అప్పలరాజు..…
కరోనా మహమ్మారి ఎక్కడ ఎప్పుడు ఎలా సోకుతుందో తెలియని పరిస్థితి.. ముఖ్యంగా ఎక్కువమంది గుమ్మిగూడే ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది ఈ వైరస్.. తాజాగా శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో కోవిడ్ కలకలమే సృష్టించింది.. సూపర్-60 కోచింగ్ తీసుకుంటున్న 28 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.. ఇటీవలే వారం రోజులు సెలవులపై ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి కోచింగ్ సెంటర్ చేరుకున్నారు.. ఈనెల 2వ తేదీ నుంచి శిక్షణా తరగతులు తిరిగి ప్రారంభం అయ్యాయి.. ఇళ్ల నుంచి…
శ్రీకాకుళం జిల్లాలో తాజాగా ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించాం అని శ్రీకాకుళం.జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. రిమ్స్ లో స్పెషల్ వార్డులో చికిత్స అందిస్తున్నాం. తీవ్రత ఎక్కువ ఉన్నవారికి మాత్రమే యాంపోటెరిసిన్ వాడుతున్నాం. బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ కు కావాల్సిన మెడిసిన్ అందుబాటులో ఉంది అన్నారు. అవసరం మేరకు ప్రభుత్వం నుంచి మందులు సప్లై ఉన్నాయి. ఆపరేషన్ అవసరమైతే చికిత్స చేయించేందుకు నిపుణులతో మాట్లాడుతున్నాం. అందుకు కావాల్సిన ఏర్పాట్లు రిమ్స్ , జెమ్స్ లో…