చివరి టీ20లో భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈరోజు (మంగళవారం) దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపొందగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. చివరి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.