Home
Social Media
Social Media News
-
Har Ghar Tiranga: ఇంటిపై జెండా కడుతూ కుప్పకూలిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో
Har Ghar Tiranga: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నడుస్తోంది. ఈ మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీంతో అందరూ తమ దేశభక్తిని చాటుకునేందుకు ఇళ్లపై జాతీయ జెండాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి తన ఇంటిపై జాతీయ జెండా కడుతూ విగతజీవిగా మారాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.… -
Girls Black Mail: పాపం అబ్బాయిలు.. వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతులు
Girls Black Mailing in soicial media: ఇటీవల కాలంలో ఆన్లైన్లోనే కొందరు వేధింపులకు గురిచేస్తున్నారు. దీని కోసం సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కొందరు యువతులు కొందరు అబ్బాయిల నంబర్లను సంపాదించి వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారు. వాట్సాప్ ఛాటింగ్లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. కొందరు యువతులు చేస్తున్న వాట్సాప్ ఛాటింగ్లు వైరల్ అవుతున్నాయి. వీడియోలను ఫేస్బుక్ ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీ… -
Constable Crying: చేతిలో ప్లేట్ పట్టుకుని ఏడ్చిన కానిస్టేబుల్.. కారణం ఏంటంటే..?
Constable Crying: యూపీలోని ఫిరోజాబాద్లో ఓ కానిస్టేబుల్ చేతిలో భోజనం పళ్లెం పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోజుకు 12 గంటలు పని చేయించుకుంటూ నాసిరకం భోజనం పెడుతున్నారని కానిస్టేబుల్ మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు రోజులుగా ఆకలితో ఉన్నానని, అధికారులు పట్టించుకోవట్లేదని అతడు వాపోయాడు. జంతువులు కూడా ఇలాంటి ఆహారాన్ని తినలేవని, అలాంటి రొట్టెలు తమకు ఇస్తున్నారని ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఇంటికి దూరంగా… -
Sourav Ganguly: మహిళల జట్టుపై గంగూలీ చేసిన ట్వీట్ మిస్ ఫైర్.. ఆడుకుంటున్న నెటిజన్లు
Sourav Ganguly Tweet Misfire: బర్మింగ్ హామ్ వేదికగా ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుపై 9 పరుగుల తేడాతో ఓటమి చెందడంతో స్వర్ణ పతకం దూరమైంది. అయితే సునాయాసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ను మహిళల జట్టు గెలవలేకపోయింది. ఒత్తిడి కారణంగా 12 బంతుల్లో 17 పరుగులు చేయలేక చతికిలపడింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ ఓ ట్వీట్ ద్వారా ప్రస్తావించాడు.… -
Tamilnadu: మద్యం మత్తులో ఉడుకుతున్న సాంబారులో పడిన వ్యక్తి.. వీడియో వైరల్
మద్యం మత్తు ప్రాణాలు తీస్తుందంటే ఎవరూ వినరు. చాలా మంది మందుబాబులు అదే పనిగా మందు తాగుతూ వేరే లోకంలో ఉంటారు. అలా తమ ప్రాణాల మీదికి తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. మద్యం మత్తులో ఉడుకుతున్న సాంబారులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధురైలోని పలంగానట్టిలో చోటుచేసుకుంది. -
Social Media DP Change: డీపీ మార్చుకుంటేనే దేశభక్తి ఉన్నట్లా..?
Social Media DP Change: భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆగస్టు 2 నుంచి ఆగస్టు 15 వరకు సోషల్ మీడియా ఉపయోగించే పౌరులంతా తమ ప్రొఫైల్ పిక్చర్ లేదా డిస్ప్లే పిక్చర్(డీపీ)గా త్రివర్ణ పతాకం ఉంచాలని ప్రధాని మోదీ ఇటీవల కోరారు. దీంతో చాలా మంది వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా పలు సోషల్ మీడియా అకౌంట్లలో ప్రొఫైల్ పిక్గా మువ్వన్నెల జెండాను… -
Mumbai: 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన మహిళ పాక్ లో ప్రత్యక్షం.. కుటుంబాన్ని కలిపిన సోషల్ మీడియా
Woman Missing For 20 Years Was found In Pak : 20 ఏళ్ల క్రితం ఉద్యోగం, ఉపాధి నిమిత్తం విదేశాాలకు వెళ్లిన మహిళ తప్పిపోయింది. 20 ఏళ్లుగా మహిళ గురించి వెతికినా.. కుటుంబ సభ్యులు ఆచూకీ కనిపెట్ట లేకపోయారు. తాజాగా ఆ మహిళ ఆచూకీని పాకిస్తాన్ లో కనుగొన్నారు. దీనికి కారణం సోషల్ మీడియానే. సోషల్ మీడియా పుణ్యామా అని సదరు మహిళ తమ కుటుంబాన్ని కలుసుకునే అవకాశం ఏర్పడింది. -
Vijaya Sai Reddy: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 19 లోక్సభ, 133 అసెంబ్లీ సీట్లు వస్తాయి
Vijaya Sai Reddy: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ సర్వే ఫలితాలను బయటపెట్టారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీకి 19 ఎంపీ సీట్లు, 133 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఇండియా టీవీ దేశ్ కీ ఆవాజ్ సర్వే అంచనా వేసిందని ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వల్ల వచ్చే 20 నెలల్లో వైసీపీకి లబ్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. దాంతో మరోసారి… -
Fine For No Petrol: ఏందయ్యా.. ఇదీ? బండిలో పెట్రోల్ లేదని రూ.250 ఫైన్
Driving Without Sufficient Fuel ..Traffic Challan From Kerala Goes Viral: ఇప్పటివరకు హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేయడం చూశాం.. డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఫైన్ వేయడం చూశాం.. కానీ బండిలో పెట్రోల్ లేదని ఫైన్ వేయడం ఎప్పుడైనా చూశామా?. ట్రాఫిక్ నిబంధనల పేరుతో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఎడాపెడా ఛలానాలు వేసేస్తున్నారని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని పుక్కల్లు… -
Ramarao On Duty: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్విట్టర్ టాక్ ఏంటి?
Ramarao On Duty Twitter Talk:మాస్ మహారాజా రవితేజకు ఇటీవల కాలంలో సరైన హిట్ లేదు. 2021 సంక్రాంతికి వచ్చిన క్రాక్ మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన కిలాడీ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి యంగ్ డైరెక్టర్…
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!