Vijaya Sai Reddy: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 19 లోక్సభ, 133 అసెంబ్లీ సీట్లు వస్తాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijaya Sai Reddy: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ సర్వే ఫలితాలను బయటపెట్టారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీకి 19 ఎంపీ సీట్లు, 133 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఇండియా టీవీ దేశ్ కీ ఆవాజ్ సర్వే అంచనా వేసిందని ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వల్ల వచ్చే 20 నెలల్లో వైసీపీకి లబ్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. దాంతో మరోసారి 150కి పైగా సీట్లు కచ్చితంగా సాధిస్తామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
IndiaTV’s Desh ki aawaaz survey gives the YSR Congress Party 19 Lok Sabha seats in AP translating into 133 assembly seats if elections were to happen today. I am sure that in the next 20months YSRCP will benefit from its door to door campaign and we will cross 150 #KavaliJagan.
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 31, 2022
మరోవైపు ఎప్పటికప్పుడు ట్వీట్ల ద్వారా టీడీపీ నేతలకు ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్లు ఇస్తున్నారు. తమకు మరో అవకాశం ఇస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు చేసిన ప్రకటన పట్ల విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.’ మరో ఛాన్సిస్తే పోలవరం పూర్తి చేస్తాడట మా చంద్రం అన్నయ్య. 14 ఏళ్లు సీఎంగా ఉండి పోలవరం గట్లపై గడ్డి కూడా పీకలేకపోయాం కదా బాబన్నయ్యా. ప్రతి సోమవారం పోలవరం టూర్లువేసి కోట్లు కొల్లగొట్టావు. మంగళవారం మాటలు ఆపేసి ముందు కందిపప్పు, కిరోసిన్ ఎలా కొలుస్తారో తెలుసుకో. కుటుంబ పరువు పోతుంది’ అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు.
మరో ఛాన్సిస్తే పోలవరం పూర్తి చేస్తాడట మా చంద్రం అన్నయ్య! 14 ఏళ్లు సీఎంగా ఉండి పోలవరం గట్లపై గడ్డి కూడా పీకలేకపోయాం కదా బాబన్నయ్యా. ప్రతి సోమవారం పోలవరం టూర్లువేసి కోట్లు కొల్లగొట్టావు. మంగళవారం మాటలు ఆపేసి ముందు కందిపప్పు, కిరోసిన్ ఎలా కొలుస్తారో తెలుసుకో!కుటుంబపరువు పోతుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 31, 2022
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!