Constable Crying: చేతిలో ప్లేట్ పట్టుకుని ఏడ్చిన కానిస్టేబుల్.. కారణం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constable Crying: యూపీలోని ఫిరోజాబాద్లో ఓ కానిస్టేబుల్ చేతిలో భోజనం పళ్లెం పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోజుకు 12 గంటలు పని చేయించుకుంటూ నాసిరకం భోజనం పెడుతున్నారని కానిస్టేబుల్ మనోజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు రోజులుగా ఆకలితో ఉన్నానని, అధికారులు పట్టించుకోవట్లేదని అతడు వాపోయాడు. జంతువులు కూడా ఇలాంటి ఆహారాన్ని తినలేవని, అలాంటి రొట్టెలు తమకు ఇస్తున్నారని ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఇంటికి దూరంగా ఉంటున్నానని.. తమకు ఇలాంటి ఆహారం పెడుతూ కడుపులు మాడుస్తున్నారని కానిస్టేబుల్ తీవ్ర ఆరోపణలు చేశాడు.
బుధవారం మధ్యాహ్నం ఫిరోజాబాద్ పోలీస్ లైన్ ముందు ఓ కానిస్టేబుల్ తన చేతిలో భోజనం ప్లేట్తో హైవేపైకి వచ్చాడు. హైవే డివైడర్పై కూర్చున్న సైనికుడు ప్లేట్లో ఉన్న బ్రెడ్ని తీసుకుని దాని నాణ్యతను ప్రశ్నించడం ప్రారంభించాడు. ఆ రొట్టెలను అక్కడ ఉన్న స్థానికులకు చూపిస్తూ.. జంతువులు కూడా ఈ రొట్టె తినలేవని… అలాంటి రొట్టెలు మనకు అందిస్తున్నారని ఆరోపించాడు. సరిపడా ఆహారం అందకపోతే డ్యూటీ ఎలా చేస్తామని ప్రశ్నించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి కానిస్టేబుల్ ఆవేదనను వీడియో తీశాడు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ మనోజ్ కుమార్ ఆవేదన పట్ల స్పందించిన పోలీస్ హెడ్క్వార్టర్స్ ఔట్పోస్టు సబ్ఇన్స్పెక్టర్తో పాటు ఇతర కానిస్టేబుళ్లు అతడి వద్దకు చేరుకున్నారు. వారి ముందు కూడా ఆహార నాణ్యతపై కానిస్టేబుల్ మనోజ్ ప్రశ్నల వర్షం కురిపించారు. తాను ఇంటికి దూరంగా ఉంటున్నానని, ఆకలితో అలమటిస్తుంటే ఇలాంటి రోటీ ఎలా తింటానని కానిస్టేబుల్ నిలదీశాడు.
Also Read
Read Also: Farmer Got Diamond: రైతు పంట పండింది.. రూ.2 కోట్ల వజ్రం దొరికింది
ఈ అంశంపై పోలీస్ లైన్ ఇన్స్పెక్టర్ దేవేంద్ర సింగ్ సికార్వార్ మాట్లాడుతూ.. పోలీస్ కార్యాలయంలోని సమన్ల సెల్లో ఉంచిన కానిస్టేబుల్ మనోజ్ కుమార్ తన భార్యతో గొడవ పడుతున్నాడని.. దీంతో అతడు కలత చెందుతున్నాడని.. బుధవారం మెస్లో భోజనం చేసేందుకు వెళ్లగా అక్కడ క్యూ ఉండటంతో అసహనం వ్యక్తం చేస్తూ మనోజ్ కుమార్ దుర్భాషలాడడం ప్రారంభించాడని.. ఆహారం తీసుకున్నా తినకుండా హైవేపైకి చేరుకుని వీడియో కోసం బోరున ఏడ్చినట్లు కనిపించాడని వివరించారు. అయితే ఈ విషయం తమ పరిశీలనలో ఉందని రూరల్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తును ప్రారంభించామని… అందరికీ ఇలాగే ఆహారం అందుతుందా లేదా మనోజ్ ఫిర్యాదు మాత్రమేనా అనే కోణంలో విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!