సింగపూర్ ఓపెన్-2022 టైటిల్ను కైవసం చేసుకున్న భారత షట్లర్ పీవీ సింధును ప్రధాని మోదీ అభినందించారు.భారత షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్ను మహిళల సింగిల్స్ విభాగంలో చైనాకు చెందిన వాంగ్ జియీని ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది.
సింగపూర్ ఓపెన్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అదరగొడుతోంది. శనివారం ఉదయం జరిగిన సెమీఫైనల్లో విజయం సాధించి ఆమె ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో జపాన్ ప్లేయర్ సీనా కవాకమీపై 21-15, 21-7 తేడాతో సింధు విజయం సాధించింది. సింధు ఈ మ్యాచ్ను కేవలం 32 నిమిషాల్లోనే ముగించింది. దీంతో టైటిల్కు ఇంకా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. సూపర్ 500 టోర్నీలో ఫైనల్ చేరడం ఈ ఏడాది పీవీ సింధుకు ఇదే మొదటిసారి. Read…
సింగపూర్ ఓపెన్లో తెలుగు తేజం పీవీ సింధు సత్తా చాటుతోంది. మహిళల సింగిల్స్లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన పీవీ సింధు తాజాగా సెమీ ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన హాన్ యూను 17-21, 21-11, 21-19 స్కోరుతో పీవీ సింధు మట్టి కరిపించింది. దీంతో టైటిల్ వేటకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. అటు ఈ సిరీస్లో మహిళల సింగిల్స్లో ఆదిలో సత్తా చాటిన మరో తెలుగు తేజం సైనా…