అస్సాంలోని కాచార్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రికి వెళ్లితే వైద్యుడు తన అనుమతి లేకుండా జననాంగాలను తొలగించారని రోగి ఆరోపించారు. బాధితుడి వయసు కేవలం 28 ఏళ్లు కావడం ఆందోళన కరంగా మారింది. మణిపూర్లోని జిరిబామ్ జిల్లాకు చెందిన అతికూర్ రెహమాన్ సిల్చార్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాడు. రోగి జననేంద్రియ ఇన్ఫెక్షన్ బాధితుడు. పరీక్షించిన వైద్యుడు బయాప్సీ పరీక్ష నిర్వహించాడు.