Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఆ దేశ న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కార కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించిందని అక్కడి స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి.
Bangladesh: బంగ్లాదేశ్లో హిందువులపై అకృత్యాలు ఆగడం లేదు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, ఆ దేశంలో మతోన్మాదులకు, ఉగ్రవాదులకు అడ్డులేకుండా పోతోంది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఈ అరాచకాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీ వంటి సంస్థల నేతలు చెలరేగిపోతున్నారు.
ప్రధాని మోడీ గురించి బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించాలని అడిగితే మోడీ అంగీకరించలేదని తెలిపారు.
Muhammad Yunus: బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ వచ్చే ఏడాది ఏప్రిల్లో దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ తాత్కాలిక నాయకుడు ముహమ్మద్ యూనస్ ప్రకటించారు. అక్కడి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. గత సంవత్సరం బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుండి షేక్ హసినా తొలగించబడిన అనంతరం దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత నెలకొంది. అప్పటి నుండి ఆమె పరారీలో ఉన్నారు. ఈ పరిణామాల…
Bangladesh: లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయీద్ నేతృత్వంలో పనిచేస్తున్న ఉగ్రసంస్థ జమాత్ ఉద్ దావా(జేయూడీ) నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది, బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనాను గద్దె దిగడానికి కారణమైన సామూహిక తిరుగుబాటు, హింసాత్మక ఉద్యమంలో తాము కూడా పాల్గొన్నామని జేయూడీ నాయకులు పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మదిగా తన చరిత్రను మరిచిపోతోంది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం సాధించడానికి కారణమైన షేక్ ముజిబుర్ రెహమాన్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి బంగ్లాదేశ్లోని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్యల్లో భాగంగానే బంగ్లాదేశ్ తన కరెన్సీ నోట్లపై జాతిపితగా పేరుగాంచిన ముజిబుర్ రెహమాన్ ఫోటోని తీసేస్తున్నారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ చీఫ్ షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ అతిపెద్ద విచారణను ప్రారంభించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడినట్లు బంగ్లాదేశ్ అభియోగాలు నమోదు చేసింది. గతేడాది, హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత ఆమె దేశం నుంచి పారిపోయి భారత్ చేరుకుంది. ప్రస్తుతం, భారత్లోనే ఆశ్రయం పొందుతోంది.
ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొంది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ రాజీనామా చేస్తానని తెలిపిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని చైనా రాయబార కార్యాలయం తన పౌరులకు ఒక సలహా జారీ చేసింది. బంగ్లాదేశ్లోని చైనా రాయబార కార్యాలయం, విదేశీయులను వివాహం చేసుకోవడానికి సంబంధిత చట్టాలను ఖచ్చితంగా పాటించాలని చైనా పౌరులకు సూచించింది. Also Read:PBKS vs MI: ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. టాప్-2 టార్గెట్!…
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా, తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్పై విరుచుకుపడ్డారు. ఆయన బంగ్లాదేశ్ని అమెరికాకు అమ్మేస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నెలలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని సైన్యం పిలుపునిచ్చిన తర్వాత, తాను రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనా అవామీ లీగ్ను అధికారికంగా నిషేధించింది. రెండు రోజుల క్రితం ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం చట్టం మునుపటి వెర్షన్ ప్రకారం దాని కార్యకలాపాలను నిషేధించింది. దీనికి సంబంధించి ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యిందని హోం సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. Also Read: IPL 2025: మే 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆరు వేదికల్లో…