Bangaldesh: బంగ్లాదేశ్లో హై అలర్ట్.. రేపు షేక్ హసీనా కేసులపై తీర్పు..
- బంగ్లాదేశ్ వ్యాప్తంగా హై అలర్ట్..
- రేపే షేక్ హసీనాపై కోర్టు తీర్పు..
Bangaldesh: గతేడాది బంగ్లాదేశ్లో హింసాత్మక ఆందోళనల తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చింది. అయితే, ఈ హింసాత్మక ఉద్యమంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు హసీనాపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) నేరాలను మోపింది. ఈ కేసులో నవంబర్ 13న తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో హై అలర్ట్ నెలకొంది.
బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీర్పుకు ముందే ఉద్రిక్తతలు పెరిగాయి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, కీలక ప్రదేశాల్లో సైన్యం, పోలీసులు మోహరించారు. బంగ్లాదేశ్ అవామీ లీగ్ గురువారం దేశవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు లాక్డౌన్ ప్రకటించింది. అన్ని వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. మహ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక పాలకుడు అయిన తర్వాత, షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్పై నిషేధం విధించాడు. అయినప్పటికీ, ఆ పార్టీ నేతలు గుర్తుతెలియని ప్రాంతాల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. గత రెండు రోజులుగా రాజధాని ఢాకాతో సహా బంగ్లాదేశ్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వాహనాలు దహనమయ్యాయి. అవామీ లీగ్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఆకస్మిక ర్యాలీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు దేశవ్యాప్తంగా ఆపరేషన్లు చేపట్టారు.
Also Read
- Iran Peace Proposal: ఇరాన్ 14-సూత్రాల ప్రతిపాదన.. అమెరికాకు 30 రోజుల అల్టిమేటం
- Operation Hormuz: హార్ముజ్ జలసంధిలో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా..
- Donald Trump: ట్రంప్ 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ప్రకటన.. హార్మూజ్లో చిక్కుకున్న ఓడలను సురక్షితంగా బయటకు..
- OPEC+ : పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తిపై ఒపెక్+ కీలక నిర్ణయం!
జూలై 2024లో విద్యార్థుల తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది. ఆగస్టు 5, 2024న, ఆమె భారతదేశానికి పారిపోయారు. ఆ తర్వాత ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, జూలై నిరసనల సందర్భంగా దాదాపు 1,400 మంది మరణించి ఉండవచ్చుని అంచనా. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్పై విముక్తి యుద్ధంలో జరిగిన మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలను విచారించడానికి షేక్ హసీనా పరిపాలన మొదట అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. ఇప్పుడే ఇదే ట్రిబ్యునల్ షేక్ హసీనాపై చట్టపరమైన చర్యల్ని ప్రారంభించింది. ఈ కేసులో సాక్ష్యాల విచారణ పూర్తయింది. గురువారం ట్రిబ్యునల్ తీర్పు చెప్పనుంది.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
IPL 2026 Orange Cap Update: ఆరెంజ్ క్యాప్ రేస్.. విరాట్ కోహ్లీ టాప్-5 నుంచి ఔట్.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ!
-
Sai Sudharsan: 13 ఏళ్ల రికార్డు బద్దలు గొట్టిన సాయి సుదర్శన్.. క్రిస్ గేల్ను వెనక్కి నెట్టిన టీమిండియా కుర్రాడు..
-
Supritha: ఆ నరకం చూడలేక చంపేయమన్నాను.. అనారోగ్యంపై సుప్రిత ఎమోషనల్ కామెంట్స్!
-
Alia Bhatt: ‘తుంబాడ్ 2’లో అలియా భట్.. హారర్ మైథాలజీలో క్రేజీ ఎంట్రీ!
-
PEDDI : పెద్ది థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్.. ఈస్ట్ గోదావరి రైట్స్ కోసం ఫైట్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!