కేరళలోని అలప్పుజా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం నాడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కేఎస్ షాన్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. శనివారం రాత్రి పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ ఘటన మరువకముందే ఆదివారం ఉదయం బీజేపీ నేత రెంజిత్ శ్రీనివాసన్ కూడా హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి హత్య చేసినట్లు తెలుస్తోంది.…