Vishnuvardhan Reddy: సంచలన ఆరోపణ… వైసీపీ మిత్రపక్షాలుగా PFI, SDPI
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార పార్టీ నేతలు ఉగ్రవాదులకు అండగా ఉంటున్నారంటూ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐలను వైసీపీ మిత్రపక్షాలుగా చూస్తోందంటూ విష్ణు మండిపడ్డారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువయ్యాయి.ఈ రెండు ఉగ్రవాద సంస్థలపై జాతీయ భద్రతా సంస్థలు నిఘా పెడుతున్నాయి.ఉగ్రవాద సంస్థల కదలికల విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి.ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పీఎఫ్ఐ, ఎస్డీపీఐ సంస్థలకు షెల్టర్ జోన్లుగా తయారయ్యాయి.
డెప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి వంటి వారు ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నారు.ఆత్మకూరు పోలీస్ స్టేషను తగులబెట్టిన వాళ్లపై కేసులు పెట్టొద్దని అధికార పార్టీ నేతలు ఒత్తిడి పెట్టారు.గుంటూరు, రాయచోటి పోలీస్ స్టేషన్లను తగుల పెట్టిన వారిని అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారు.పీఎఫ్ఐ, ఎస్డీపీఐ పార్టీలు వైసీపీ మిత్రపక్షాలా..?పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ప్రతినిధులపై ఉన్న కేసులను ఈ ప్రభుత్వం రద్దు చేస్తుందా..?జైళ్ల నుంచి విడుదలైన పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ప్రతినిధులతో కలిసి ర్యాలీలు చేస్తారా..? అని ప్రశ్నించారు విష్ణువర్థన్ రెడ్డి.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
Read Also: Anesthetic Injection: నా ట్రీట్మెంట్ మీద నమ్మకం ఉంది.. ఎన్టీవీతో డాక్టర్ శశిబాల
ఉగ్రవాద సంస్థల ప్రతినిధులతో గతంలో హోం మంత్రిగా ఉన్న సుచరిత చర్చలు జరుపుతారా..?తనను పొగిడించుకోవడానికి లేదా కొత్త సమస్యలు సృష్టించడానికి జగన్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.పేర్లు మార్చి.. స్టిక్కర్లు మార్చి లాభం పొందాలని వైసీపీ భావిస్తోంది.వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్లు మార్చడం కాదు.. ప్రజల హృదయాలను గెలవండి.పేర్లు మార్చాలనుకుంటే గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చండి.పాకిస్తాన్ మూలాలున్న జిన్నా పేరుతో గుంటూరులో టవరా..?జిన్నా టవరుకు అబ్దుల్ కలాం పేరు పెట్టండి. కింగ్ జార్జ్ ఆస్పత్రికి అల్లూరి సీతారామారాజు పేరు పెట్టుకోండి.
మీ కంపెనీలకు మీ పేర్లు పెట్టుకొండి.. ప్రజాధనంతో ఏర్పాటైన సంస్థలకు మీ పేర్లెందుకు..?పోలవరానికి కేంద్రం నిధులిస్తోంది కదా..? వాజ్ పేయి పేరు పెట్టండి.అనవసరంగా హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పిడి అంశం తెర మీదకు తెచ్చారు.వైసీపీ అజెండా ఫిక్స్ చేస్తే.. టీడీపీ ఆ అజెండాను ఫాలో అవుతుంది.టీడీపీ వైసీపీ ట్రాపులో పడకూడదు.కేంద్రం ఇచ్చిన మెడికల్ కాలేజీలను తామే పెట్టినట్టు జగన్ చెప్పుకుంటున్నారు.ఏపీని వైసీపీ తమ శాశ్వత సామ్రాజ్యంగా భావిస్తోంది.ప్రాంతీయ పార్టీలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండదు.పక్క రాష్ట్రంలో జెండా ఉండదు.. టీడీపీ జాతీయ పార్టీగా చెప్పుకుంటుందన్నారు విష్ణువర్థన్ రెడ్డి.
Read ALso: Yanamala Ramakrishnudu: అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు.. నియంత పోకడలు
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!