Vishnuvardhan Reddy: సంచలన ఆరోపణ… వైసీపీ మిత్రపక్షాలుగా PFI, SDPI
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార పార్టీ నేతలు ఉగ్రవాదులకు అండగా ఉంటున్నారంటూ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐలను వైసీపీ మిత్రపక్షాలుగా చూస్తోందంటూ విష్ణు మండిపడ్డారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువయ్యాయి.ఈ రెండు ఉగ్రవాద సంస్థలపై జాతీయ భద్రతా సంస్థలు నిఘా పెడుతున్నాయి.ఉగ్రవాద సంస్థల కదలికల విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి.ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పీఎఫ్ఐ, ఎస్డీపీఐ సంస్థలకు షెల్టర్ జోన్లుగా తయారయ్యాయి.
డెప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి వంటి వారు ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నారు.ఆత్మకూరు పోలీస్ స్టేషను తగులబెట్టిన వాళ్లపై కేసులు పెట్టొద్దని అధికార పార్టీ నేతలు ఒత్తిడి పెట్టారు.గుంటూరు, రాయచోటి పోలీస్ స్టేషన్లను తగుల పెట్టిన వారిని అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారు.పీఎఫ్ఐ, ఎస్డీపీఐ పార్టీలు వైసీపీ మిత్రపక్షాలా..?పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ప్రతినిధులపై ఉన్న కేసులను ఈ ప్రభుత్వం రద్దు చేస్తుందా..?జైళ్ల నుంచి విడుదలైన పీఎఫ్ఐ, ఎస్డీపీఐ ప్రతినిధులతో కలిసి ర్యాలీలు చేస్తారా..? అని ప్రశ్నించారు విష్ణువర్థన్ రెడ్డి.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Read Also: Anesthetic Injection: నా ట్రీట్మెంట్ మీద నమ్మకం ఉంది.. ఎన్టీవీతో డాక్టర్ శశిబాల
ఉగ్రవాద సంస్థల ప్రతినిధులతో గతంలో హోం మంత్రిగా ఉన్న సుచరిత చర్చలు జరుపుతారా..?తనను పొగిడించుకోవడానికి లేదా కొత్త సమస్యలు సృష్టించడానికి జగన్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.పేర్లు మార్చి.. స్టిక్కర్లు మార్చి లాభం పొందాలని వైసీపీ భావిస్తోంది.వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్లు మార్చడం కాదు.. ప్రజల హృదయాలను గెలవండి.పేర్లు మార్చాలనుకుంటే గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చండి.పాకిస్తాన్ మూలాలున్న జిన్నా పేరుతో గుంటూరులో టవరా..?జిన్నా టవరుకు అబ్దుల్ కలాం పేరు పెట్టండి. కింగ్ జార్జ్ ఆస్పత్రికి అల్లూరి సీతారామారాజు పేరు పెట్టుకోండి.
మీ కంపెనీలకు మీ పేర్లు పెట్టుకొండి.. ప్రజాధనంతో ఏర్పాటైన సంస్థలకు మీ పేర్లెందుకు..?పోలవరానికి కేంద్రం నిధులిస్తోంది కదా..? వాజ్ పేయి పేరు పెట్టండి.అనవసరంగా హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పిడి అంశం తెర మీదకు తెచ్చారు.వైసీపీ అజెండా ఫిక్స్ చేస్తే.. టీడీపీ ఆ అజెండాను ఫాలో అవుతుంది.టీడీపీ వైసీపీ ట్రాపులో పడకూడదు.కేంద్రం ఇచ్చిన మెడికల్ కాలేజీలను తామే పెట్టినట్టు జగన్ చెప్పుకుంటున్నారు.ఏపీని వైసీపీ తమ శాశ్వత సామ్రాజ్యంగా భావిస్తోంది.ప్రాంతీయ పార్టీలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండదు.పక్క రాష్ట్రంలో జెండా ఉండదు.. టీడీపీ జాతీయ పార్టీగా చెప్పుకుంటుందన్నారు విష్ణువర్థన్ రెడ్డి.
Read ALso: Yanamala Ramakrishnudu: అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు.. నియంత పోకడలు
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!