NIA Raids in Guntur and Kurnool: గుంటూరు, కర్నూలులో ముగిసిన NIA సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, కర్నూలులో NIA అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరులో NIA అధికారుల సోదాలు ముగిశాయి. మొత్తం ఏడు గంటల పాటు సోదాలు చేశాయి NIA బృందాలు…మూడు బృందాలతోపాటు డీఐజీ స్థాయి అధికారి ఈ సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం…PFI, SDPIకి చెందిన ముగ్గురు కీలక అనుమానితులని అదుపులోకి తీసుకున్నాయి ఎన్ఐఏ బృందాలు…మొత్తం ఏడు గంటల పాటు సోదాలు చేయడంతో ఏం జరుగుతుందో తెలీక స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
Read Also: Adani, Reliance Pact: ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద.. ఈ ఇంటి మీది కాకి ఆ ఇంటి మీద వాలటానికి వీల్లేదు
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ముఖ్యనేతల కార్యాలయాలు, ఇళ్లపై సోదాలు కొనసాగాయి. గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి అధికారులు సోదాలు నిర్వహించగా… పాత గుంటూరులోని పలు ప్రాంతాలలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. వహీద్, రహీమ్, జఫ్రుల్లా ఖాన్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు NIA అధికారులు. వచ్చేనెల 8న విచారణకు హాజరుకావాలంటూ PFI సభ్యులకు ఎన్.ఐ.ఏ. అధికారులు నోటీసులు జారీచేశారు.
కరాటే శిక్షణ పేరుతో పీఎఫ్ఐ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించడంతో పాటు యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు వచ్చిన ఆరోపణలతో ఈ సోదాలు జరిగాయి. గుంటూరుతో పాటు కర్నూలులోని ఖడక్పూర్ వీధిలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఎస్డీపీఐ నాయకుడి ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.ఇదిలా వుంటే కర్నూలులో NIA దాడులకు నిరసనగా గాంధీ విగ్రహం ముందు SDPI ఆందోళనకు దిగింది.ఎస్డీ పి ఐ నేతలు అబ్దుల్ వారిస్, ఇంతియాజ్ ఇళ్లలో సోదాలు చేయడంతో ఎన్ ఐ ఏ అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఎన్ ఐ ఏ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏమీ దొరకకపోవడంతో వెనుదిరిగివెళ్లిపోయారు ఎన్ ఐ ఏ అధికారులు. టు టౌన్ పీఎస్ కు చేరుకున్నారు ఎన్ ఐ ఏ అధికారులు.
Read Also: Theft in Bajaj Showroom: ఎలక్ట్రానిక్స్ షోరూంలో దొంగ దర్జా.. తాపీగా లక్షలు దోచుకెళ్ళిన కేటుగాడు
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..