నిన్న (మే10) లక్నో సూపర్ జెయింట్స్పై గుజరాత్ టైటాన్స్ సాధించిన విజయంలో శుబ్మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఇతర బ్యాట్స్మెన్స్ అంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా.. ఇతనొక్కడే 49 బంతుల్లో 7 ఫోర్లతో 69 పరుగులు చేసి, చివరివరకూ అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే సుధీర్ఘకాలం నుంచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్ను అతడు అందుకున్నాడు. 2009లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్…
2007లో టీ20 ప్రపంచకప్కు ముందు భారత కెప్టెన్గా ఎంతో మంది సీనియర్లను కాదని బీసీసీఐ ధోనీని నియమించింది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్కు సీనియర్లు దూరంగా ఉండటంతో యువరాజ్కు కెప్టెన్సీ ఇస్తారని అందరూ భావించారు. అయితే బీసీసీఐ అనూహ్యంగా ధోనీకి పగ్గాలు ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐపై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. 2007లో తాను కెప్టెన్ కావాల్సిందని.. కానీ అప్పుడు గ్రెగ్ ఛాపెల్ ఘటన జరిగిందని.. అది…
2011లో సరిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 2) కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా రెండో సారి ప్రపంచ విజేతగా నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. తమ సీనియర్ ఆటగాడు సచిన్కు అందమైన బహుమతిని అందజేసింది. భారత్ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్లో భారీ అంచనాల నడుమ టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. లీగ్ దశలో బంగ్లాదేశ్తో తమ…
క్రికెట్ దిగ్గజం, భారతరత్న పురస్కార గ్రహీత సచిన్ టెండుల్కర్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుసుకున్నారు. ముంబై పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. శుక్రవారం ఉదయం రాజ్ భవన్లో సచిన్తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అయితే ఇది మర్యాదపూర్వక భేటీనే అని తెలుస్తోంది. కాగా రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25తో ముగియనుంది.…
టీమిండియా రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడి నిలిచాడు. మూడు వన్డేల సిరీస్లో బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ రికార్డు అందుకున్నాడు. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. విదేశాల్లో సచిన్ వన్డేల్లో 5,065 పరుగులు చేయగా… విరాట్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.…
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా కారణంగా త్వరలో ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. జనవరి 20 నుంచి 29 వరకు ఒమన్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజాస్ జట్టు తరఫున సచిన్ బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఈ లీగ్లో ఆడనని సచిన్ చెప్పడంతో క్రికెట్ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. Read Also: ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా యువ…
క్రిస్మస్ సందర్భంగా పలువురు క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ కూడా సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా వేర్వేరు సంవత్సరాల్లో తాను క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న ఫోటోలను కూడా సచిన్ షేర్ చేశాడు. ఇందులోని ఓ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్య గెటప్లో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్యగా ఓ బాలికతో సందడి చేస్తున్నట్లు ఉంది. ఈ ఫోటో 2018లో తీసినట్లు సచిన్…
యాషెస్ టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మరో ఘనత సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దీంతో అతడు ఈ ఘనతలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను అధిగమించాడు. అయితే శనివారం అడిలైడ్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో యాషెస్ టెస్టులో రూట్ 3వ రోజు ఈ ఫీట్ సాధించాడు. 2008లో దక్షిణాఫ్రికా ఆటగాడు గ్రేమ్ స్మిత్ తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్లో 1,600 కంటే…
భారత క్రికెట్ దిగ్గజ మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సచిన్ స్నేహితురాలు తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో వెంటనే స్పందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, పౌరులను ట్విటర్ వేదికగా సచిన్ అభినందించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ను నేరుగా కలిసి ధన్యవాదాలు చెప్పినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి సీరియస్ కండిషన్లో ఉన్న తన స్నేహితురాలిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ ఆటోలో ఆస్పత్రికి తీసుకువెళ్లాడని..…
ప్రపంచంలో అత్యంత ఆరాధించబడే టాప్-20 పురుషుల జాబితాలో విరాట్ కోహ్లి చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లి 18వ స్థానంలో నిలిచాడు. అయితే కోహ్లీ కంటే ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఈ జాబితాలో మోడీ 8వ స్థానంలో నిలవగా… ఎప్పుడో క్రికెట్ ను వదిలేసిన సచిన్ 12 వ స్థానంలో ఉన్నాడు. అలాగే షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్…