Crime News: అవసరానికి అప్పు ఇచ్చి ఆదుకునే వాడు దేవుడితో సమానం అంటారు. ఆర్ధిక అవసరం గట్టెక్కితే.. అప్పు మెల్లగా తీర్చుకోవచ్చని అందరూ భావిస్తారు. అలా డబ్బు సమయానికి ఇచ్చిన వాళ్లని ఎంతగానో అభిమానిస్తారు. ఐతే కాకినాడ జిల్లాలో మాత్రం ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. అప్పు తీర్చాల్సి వస్తుందని.. ఇచ్చిన వ్యక్తులనే హత్య చేశాడు. ఇద్దరిని చంపేసి..మూడో వ్యక్తిని చంపేందుకు ప్రయత్నించాడు. కానీ ప్లాన్ బెడిసి కొట్టడంతో పోలీసులకు చిక్కాడు. కాకినాడ జిల్లా తాటిపర్తిలోని…
ఉమ్మడి మెదక్ జిల్లాలో చేతబడి పేరుతో హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో తోడబుట్టిన వాళ్ళను హత్య చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రెండు దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. సాంకేతిక యుగంలోనూ మూఢ నమ్మకాలను బలంగా నమ్ముతున్నారు జనం. ఏదైనా రోగం వస్తే మంత్రాలతోనే వచ్చిందని నమ్ముతున్నారు.
ఈ మధ్య ప్రియుడితో కలిసి భర్తలను చంపేస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. ఈ సంచలనాత్మక కేసు బండేయా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమునా గ్రామానికి చెందినది.