ఏపీ రాజకీయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ అధికారం ఉందని.. ప్రతిపక్షం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అంటూ పేర్కొన్నారు. ఏపీలో ఉంది కేవలం అధికార పక్షమేనని.. ఏపీలో అందరూ బీజేపీ పక్షమేనన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. రానున్న రోజుల్లో ప్రమాదకరంగా మారిన నాయకులకు కనువిప్పు కలిగించాలని, లేకపోతే కాలగర్భంలో కలిసిపోయే విధంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కాంగ్రెస్ కోరుకొంటోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సమాజానికి హానీ కలిగించే వ్యక్తులను అమ్మవారు శిక్షిస్తుందని రేవంత్ అన్నారు. ప్రజలు మనుషుల వల్ల కానీ పనులను అమ్మవారు చేస్తుందనే సంపూర్ణ విశ్వాసం ఉందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే.. క్రూరమైన ఆలోచనలతో పాలిస్తున్న వారికి…