CM Revanth Reddy : మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటాం
- గ్లోబల్ మాదిగ డే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- మాదిగల కోసం అనుకూల నిర్ణయం తీసుకుంటామని రాహుల్ అన్నారు
- ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో కాంగ్రెస్ విధానం స్పష్టంగా తెలియజేశాం
- సుప్రీంకోర్టు తీర్పులో కాంగ్రెస్ ప్రభుత్వ క్రియాశీల పాత్ర ఉంది. : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒక స్పష్టమైన ప్రకటన చేశారని, మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేసామని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా దామోదర రాజనర్సింహ గారి నేతృత్వంలో న్యాయవాదులను నియమించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టులో తీర్పు దానంతట అదే రాలేదు…ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో క్రియాశీల పాత్ర పోషించిందని, సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తుందని శాసనసభ వేదికగా మేం స్పష్టంగా ప్రకటించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సమస్యలా ఈ సమస్య జఠిలం అయిందని, కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీ వాదనలో బలం ఉంది.. మీకు న్యాయం చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉందని, న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం వేసామని సీఎ రేవంత్ రెడ్డి తెలిపారు.
Bhatti Vikramarka: డైట్ చార్జీల పెంపు చారిత్రాత్మక మైన రోజు
Also Read
అంతేకాకుండా..’ 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జ్యుడీషియల్ కమిషన్ ను కూడా నియమించాం.. మరో వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.. సీఎం పేషీలో మాదిగలు ఉండాలని డా.సంగీత గారిని నియమించుకున్నాం. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీసీగా ఒక మాదిగ సామాజిక వర్గం వ్యక్తిని నియమించాం. IIT వీసీగా, విద్యా కమిషన్ మెబర్ గా, ఉన్నత విద్యా శాఖలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాం. పగిడి పాటి దేవయ్య గారిని స్కిల్ యూనివర్సిటీ బోర్డు డైరెక్టర్ గా నియమించుకున్నాం.. అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాం.. ఈ ప్రభుత్వం మీకు అన్యాయం జరగనివ్వదు.. న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తాం.. అమలుచేయడంలో కొంత ఆలస్యం కావచ్చు… కానీ మీకు తప్పక న్యాయం చేస్తాం.. నా రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉంది.. ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత నాది…’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
PAK: మరో మైలురాయి సాధించిన బాబర్ ఆజం.. కోహ్లీని వెనక్కి నెట్టి
తాజావార్తలు
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో