తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని.. అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని స్త్రీ శిశు సంక్షేమ , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి సీతక్కతో పాటు మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాటు పలువురు మహిళ అధికారిణిలు పాల్గొన్నారు.
విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె డా.అలైదా గువేరా నేడు హైదరాబాద్ రానున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్టే ఫానియా గువేరా కూడా నగరానికి వస్తున్నారు. ఇవాళ (ఆదివారం) సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే 'క్యూబా సంఘీభావ సభ'కు అలైదా గువేరా, ఎస్టీ ఫానియా ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు.