బంగారం స్మగ్లింగ్ చేస్తూ కన్నడ నటి రన్యారావు బెంగళూరు ఎయిర్పోర్టులో పట్టుబడింది. ఆమె వీఐపీ ప్రొటోకాల్ ఉపయోగించుకోవడంపై కర్ణాటక ప్రభుత్వం.. అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. నివేదికను గత గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. తాజాగా నివేదికకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఈనెల 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.12 కోట్లకుపైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు చేయగా రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు వ్యవహారం కుటుంబ సభ్యులకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆమె ఒక్కదానితోనే ఈ కేసు నడవడం లేదు. ప్రస్తుతం ఈ కేసును సీరియస్గా తీసుకున్న డీఆర్ఐ అధికారులు.. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
Ranya Rao Case: సినీనటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ నుంచి రూ. 12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను ప్రత్యేకమైన బెల్టు సాయంతో నడుముకు చుట్టుకుని తీసుకువస్తుండగా, బెంగళూర్ ఎయిర్పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు పట్టుబడింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. ఈ కేసులో గోల్డ్ మాఫియా ఇన్వాల్వ్ అయినట్లు భావిస్తుండటంతో ఇటు ఈడీ, అటు సీబీఐ రెండూ…
Ranya Rao Case: బంగారం అక్రమ రవాణా కేసులో సినీ నటి రన్యా రావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆమెపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని న్యాయమూర్తి విశ్వనాథ్ సీ గౌడర్ అన్నారు. జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచాలనే ప్రాసిక్యూషన్ వాదనల్లో ఏకీభవించారు.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ నటి రన్యారావు కేసు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. రన్యా రావు సంస్థకు భూమి కేటాయింపుపై అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.