Ranya Rao Case: నన్ను చెంపపై 15 సార్లు కొట్టారు.. ఆకలితో ఉంచి, ఖాళీ పేపర్పై సంతకం చేయించారు..
- నాపై 15 సార్లు చెంపదెబ్బ కొట్టారు..
- ఆకలితో ఉంచి, ఖాళీ పేపర్లపై సంతకం చేయించుకున్నారు..
- అధికారులపై రన్యా రావు సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranya Rao Case: సినీనటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ నుంచి రూ. 12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను ప్రత్యేకమైన బెల్టు సాయంతో నడుముకు చుట్టుకుని తీసుకువస్తుండగా, బెంగళూర్ ఎయిర్పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు పట్టుబడింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. ఈ కేసులో గోల్డ్ మాఫియా ఇన్వాల్వ్ అయినట్లు భావిస్తుండటంతో ఇటు ఈడీ, అటు సీబీఐ రెండూ దర్యాప్తు చేస్తున్నాయి.
రన్యారావు సుపరిచిత సినీ నటి కావడం, కర్ణాటక డీజీపీ సవతి కూతురు కావడంతో ఈ అంశం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే, రన్యా రావు డీఆర్ఐ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. కస్టడీలో తనపై అధికారులు చేయిజేసుకున్నారని, పలుమార్లు చెంపదెబ్బ కొట్టారని, ఆహారం ఇవ్వకుండా, ఖాళీ పత్రాలపై బలవంతంగా సంతకం చేయించుకున్నారని ఆరోపించారు. డీఆర్ఐ అదనపు డైరెక్టర్ జనరల్కి రాసిన లేఖలో, రన్యా రావు మరోసారి తాను నిర్దోషిని సమర్థించుకుంది. తప్పుడు కేసులో ఇరికించినట్లు పేర్కొంది.
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
Read Also: CM Revanth Reddy: హద్దు దాటితే గుడ్డలు ఊడదీసి కొడతా.. సోషల్ మీడియా పోస్టులపై సీఎం ఫైర్
పదేపదే దాడి చేసినప్పటికీ డీఆర్ఐ అధికారులు తయారు చేసిన ప్రకటనపై తాను సంతకం చేయడానికి నిరాకరించానని ఆమె లేఖలో పేర్కొంది. చివరకు తీవ్ర ఒత్తిడితో 50-60 టైప్ చేసిన పేజీలు, 40 ఖాళీ తెల్ల పేజీలపై సంతకం చేయాల్సి వచ్చినట్లు చెప్పింది. తాను అరెస్ట్ అయిన క్షణం నుంచి తనపై అధికారులు శారీరక దాడి చేసినట్లు చెప్పింది. 10-15 సార్లు చెంపపై కొట్టారని, పదేపదే దాడులు చేసినప్పటికీ స్టేట్మెంట్పై సంతకం చేయడానికి నిరాకరించానని రన్యా వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం రన్యా రావు కళ్ల కింద నల్లటి మచ్చలు ఉన్న ఫోటో ఒకటి వైరల్ అయింది.
తాను అంగీకరించకుంటే తన తండ్రి గుర్తింపును బయటపెడతానని ఒక డీఆర్ఐ అధికారి బెదిరించారని కూడా రన్యా ఆరోపించింది. ఈ కేసులో తన తండ్రి ప్రమేయం లేదని ఆమె చెప్పింది. మార్చి 3న సాయంత్రం 6.45 గంటల నుండి మార్చి 4న రాత్రి 7.50 గంటల వరకు నిర్బంధంలో ఉన్న సమయంలో తనకు ఉద్దేశపూర్వకంగా నిద్ర, ఆహారం నిరాకరించారని కూడా ఆమె పేర్కొన్నారు. మార్చి 10న కోర్టులో రన్యా రావు విలపించింది. డీఆర్ఐ అధికారులు వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఆపేసినప్పుడు మాటలతో దుర్భాషలాడుతున్నారని ఆరోపించింది.
తాజావార్తలు
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!