100 Airports: వచ్చే ఏడాది నాటికి మన దేశంలో వంద విమానాశ్రయాలు డెవలప్ కానున్నాయి. ఇందులో భాగంగా.. ఇప్పటికే ఉన్న ఎయిర్పోర్టులను ఉన్నతీకరించటం మరియు ఆధునికీకరించటం జరుగుతుంది. ఉదే దేశ్ కా ఆమ్ నాగ్రిక్.. అంటే.. ఉడాన్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద ఈ పనులు చేపడతారు. ఈ ప్రాంతీయ అనుసంధాన పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఇతర ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు వీటిని పూర్తి చేస్తారు.
Railway Minister Ashwini Vaishnaw: రైళ్లలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది.. కేంద్రం.. రైలు ప్రయాణీకులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు దేశంలోని అన్ని రైళ్ళు, రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులు, మెడికల్ సామాగ్రి, ఆక్సిజన్ సిలిండర్ కలిగిన మెడికల్ బాక్స్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అత్యవసర పరిస్థితులలో ప్రయాణీకులకు ఫస్ట్ ఎయిడ్ సేవలు…
PM Narendra Modi: రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని నరేంద్రమోదీ రాజ్యసభలో ధన్యవాద తీర్మానానికి సమాధానం ఇస్తూ మరోసారి కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని ప్రసంగం సమయంలో ప్రతిపక్షాలు మోదీ-అదానీ భాయ్ భాయ్ అని నినాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. బుధవారం లోక్ సభలో సమాధానం ఇచ్చిన ఆయన, గురువారం రాజ్యసభలో కూడా కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. Read Also: INDvsAUS 1st Test: అదరగొట్టిన జడేజా, అశ్విన్.. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్…
AP 3 Capitals: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం.. అసలు రాజధానులు ఎక్కడ పెట్టాలనేది రాష్ట్రాల ఇష్టం అని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన విజయసాయి రెడ్డి.. ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, జనాభా ప్రాతిపదికపై బీసీలకు రిజర్వేషన్లు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు ,విశాఖ మెట్రో అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే ఏపీలో మూడు…
Solar Parks: క్రమంగా విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది.. దీంతో, ప్రత్యామ్నాయలపై దృష్టి సారించింది ప్రభుత్వం.. అందులో భాగంగా.. సోలార్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.. ఇక, సోలార్ పార్కుల అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 4100 మెగావాట్ల సామర్థ్యంతో 5 సోలార్ పార్కులు మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదక శక్తి, విద్యుత్ శాఖల మంత్రి ఆర్ కే సింగ్ వెల్లడించారు. ఇవాళ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు.. రాతపూర్వకంగా సమాధానం…
Nirmala Sitharaman: సెస్సులు, సర్చార్జీల్లో రాష్ట్రాల వాటాపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. నిర్దుష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై విధించే సర్చార్జీలు ఇతర సుంకాలలో రాష్ట్రాలకు వాటా ఉండబోదని ఇవాళ రాజ్యసభలో స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు.. సమాధానం ఇచ్చారు నిర్మలా సీతారామన్.. సెస్సులు, సర్చార్జీలు ఇతర సుంకాల పేరిట వసూలు చేసే మొత్తాలను పూర్తిగా కేంద్ర…
Uniform Civil Code: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం గురువారం రాజ్యసభకు తెలియజేసింది. యూనిఫాం సివిల్ కోడ్ కు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి సిఫారసులు చేయాలని ప్రభుత్వం 21వ లా కమిషన్ ను కోరిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు ఉన్నట్లు పార్లమెంట్లో ప్రకటించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్.. రైతుల రుణ భారంలో దేశంలోనే ఏపీ టాప్లో ఉందని.. రెండు, మూడు స్థానాల్లో కేరళ, పంజాబ్ ఉంటే.. రూ. 1,52,113 తలసరి అప్పుతో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని ఆయన రాజ్యసభలో వెల్లడించారు. తలసరి రుణ భారం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్ ఉన్నాయని.. జాతీయ సగటు కంటే…