ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. గురువారం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటివరకు రెండు జట్లు చెరో 4 మ్యాచ్ లు ఆడి, 3 విజయాలు సాధించి ఊపుమీదున్నాయి. మెరుగైన రన్ రేట్ తో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్ లో గుజరాత్ గెలిస్తే అత్యధిక విజయాలతో పాయింట్ల పట్టికలో ప్రథమస్థానానికి ఎగబాకుతుంది. అందుకే రెండు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు…
ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్థాన్ ఆటగాడు జాస్ బట్లర్ మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. గత మ్యాచ్లో సెంచరీ చేసిన బట్లర్.. మంగళవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లోనూ రాణించాడు. బట్లర్ ఆట వల్లే రాజస్థాన్ చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలించకపోవడంతో రాజస్థాన్ బ్యాటర్స్ తొలుత పరుగులు చేసేందుకు ఇబ్బంది…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. జోస్ బట్లర్ సెంచరీ.. రాజస్థాన్ రాయల్స్కు 23 పరుగుల తేడాతో విజయం సాధించి పెట్టింది.. ముంబైతో జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ నేతృత్వంలోని జట్టు వేగంగా నాలుగు వికెట్లు పడగొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన గెలుపు నమోదు చేసింది.. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో ముంబైని పటిష్టమైన స్కోర్ వైపు నడిపించే…
ఇటీవల రాజస్థాన్ రాయల్స్తో ఆడిన మ్యాచ్లో 61 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ దారుణ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 210/6 స్కోర్ చేయగా.. సన్రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్లో సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుటైన విధానంపై దుమారం రేగుతోంది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో విలియమ్సన్ క్యాచ్ అవుట్ అయ్యాడని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. అయితే…
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మిక మరణంపై క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో షేన్ వార్న్ జ్ఞాపకాలను స్మరించుకుంటోంది. భారత క్రికెట్లో కూడా షేన్ వార్న్ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ఇండియాలో సూపర్ డూపర్ హిట్ లీగ్ ఐపీఎల్లో తొలి ట్రోఫీని ముద్దాడింది షేర్ వార్న్ జట్టే కావడం విశేషం. ఐపీఎల్ తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన వార్న్ ఆ జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించాడు. తొలి…
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున ఆకట్టుకున్న దేశవాళీ క్రికెటర్లలో రాహుల్ తెవాటియా ఒకడు. 1993లో మే 20న హర్యానాలో జన్మించిన రాహుల్ తెవాటియా క్రికెట్లో బౌలింగ్ ఆల్రౌండర్గా ఎదిగాడు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నమెంట్లో పంజాబ్పై రాహుల్ తెవాటియా ఆడిన ఇన్నింగ్స్ను క్రీడాభిమానులు ఎవరూ మరిచిపోలేరు. రాజస్థాన్ ఓడిపోతుందని అందరూ భావించిన తరుణంలో అనూహ్యంగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి గెలిపించిన ఆటగాడు రాహుల్ తెవాటియా. Read Also: ఫుట్బాల్ స్టార్…
కీలక మ్యాచ్లో కోల్కతా ఆటగాళ్లు చెలరేగిపోయారు. రాజస్థాన్పై భారీ విజయం సాధించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభమన్ గిల్ హాఫ్ సెంచరీతో.. వెంకటేశ్ అయ్యర్ 38 పరుగులతో రాణించారు. తరువాత వచ్చిన బ్యాట్స్మెన్ కూడా బ్యాట్కు పనిచెప్పారు. దినేశ్ కార్తీక్ , మోర్గాన్ నాటౌట్గా నిలిచారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సంజు సేన..85 పరుగులకే కుప్పకూలింది. రాజస్థాన్ బ్యాట్స్మెన్లో రాహుల్…
ఐపీఎల్ 20 21 ఈరోజు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ బౌలింగ్ ఎంచుకొని రాజస్థాన్ జట్టును మొదట బ్యాటింగ్ కు పంపిస్తుంది. ఇక ఈ రెండు జట్లకు ప్లేఆఫ్స్ కు వెళ్లడం కోసం ఈ మ్యాచ్ చాలా కీలకం. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని ఈ రెండు జట్లు అనుకుంటున్నాయి. దానికి తగ్గట్లుగానే ఈ మ్యాచ్…
ఐపీఎల్ లో ఈరోజు కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో షార్జా వేదికగా ముంబై ఇండియన్స్ జట్టు రాజస్తాన్ రాయల్స్ జట్టును ఎదుర్కోనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే… రెండు టీమ్స్ కి ఇది కీలక మ్యాచ్. ఇందులో ఎవరు ఓడిపోయినా వారు ఇంటికే. ఇక ప్రస్తుతం 10 పాయింట్స్ తో 6వ స్థానంలో రాజస్తాన్, 7వ స్థానంలో ముంబై జట్టు ఉంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ లో 23 సార్లు హెడ్ టు హెడ్ ముంబై, రాజస్తాన్…
చెన్నై సూపర్ కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. శనివారం అబుదాబిలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో తన ఫ్లేఆఫ్అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. యశస్వీ జైశ్వాల్, శివమ్ దూబే.. హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో.. చెన్నై నిర్దేశించిన 190 పరుల భారీ లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలుండగానే.. ఛేదించింది రాజస్థాన్. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20…