అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతితో రాజస్థాన్ రాయల్స్ భంగపాటుకు గురైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లోనూ సంజు శాంసన్ ఇదే తప్పు చేశాడు. ఫైనల్లో కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై విమర్శలు చెలరేగాయి. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సంజు శాంసన్ వివరించాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు…
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రికార్డు సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా అరుదైన ఫీట్ సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హార్డిక్ పాండ్యాను ఔట్ చేసి 27వ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా పర్పుల్ క్యాప్ను కూడా సొంతం చేసుకున్నాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇమ్రాన్ తాహిర్ 26 వికెట్లు తీయగా.. ఇప్పుడు తాహిర్ రికార్డును బ్రేక్ చేసి తొలి స్థానానికి…
ఈ సీజన్ ఐపీఎల్లో కొత్త ఛాంపియన్గా గుజరాత్ టైటాన్స్ ఆవిర్భవించింది. లీగ్లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే కప్పు అందుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ విధించిన 131 పరుగుల టార్గెట్ను సులభంగా ఛేదించింది. శుభ్మన్ గిల్ (45 నాటౌట్), హార్దిక్ పాండ్యా (34), మిల్లర్ (32 నాటౌట్) రాణించడంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ గెలుపొందింది. రాజస్థాన్…
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ ముందు రాజస్థాన్ తేలిపోయింది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుని తప్పు చేసింది. గుజరాత్ బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ కుప్పకూలింది. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. కీలకమైన ఫైనల్ మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బట్లర్ 39, జైశ్వాల్ 22 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. గుజరాత్ బౌలర్లలో హార్డిక్ పాండ్యా 3 వికెట్లు, సాయి…
ఐపీఎల్ 2022 విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్కు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్ల వివరాలు: రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయిర్,…
ఐపీఎల్ 2022 తుది దశకు చేరుకుంది. ఆదివారం రాత్రికి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. అయితే ఐపీఎల్ విన్నర్కు ఇచ్చే ప్రైజ్ మనీపై సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. విజేతకు అక్షరాలా రూ.20కోట్లు అందనున్నాయి. రన్నరప్గా నిలిచే జట్టు రూ.13కోట్లు దక్కించుకోనుంది. అటు మూడో స్థానంలో నిలిచిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రైజ్ మనీగా రూ.7కోట్లు అందనున్నాయి. మరోవైపు 4వ స్థానంలో ఉన్న లక్నో సూపర్జెయింట్స్…
ఆది నుంచి ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ సీజన్ 2022 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్లో జట్ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. అయితే నిన్న రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడి నెగ్గింది. దీంతో ఫైనల్లో గుజరాత్తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్…
గత రాత్రి జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్కు అర్హత సాధించింది. ఈసారి కూడా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైన బెంగళూరు ట్రోఫీ కల నెరవేర్చుకోకుండానే ఇంటి ముఖం పట్టింది. రజత్ పటీదార్ మరోమారు ఆపద్బాంధవుడిగా మారడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. రాజస్థాన్ ఎదుట 158 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. అయితే.. రాజస్థాన్ ఓపెనర్…
ఐపీఎల్ సీజన్ 2022 చివరి దశకు చేరువైంది. ఈ నేపథ్యంలో జట్ల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారింది. అయితే.. ఐపీఎల్-2022లో భాగంగా క్వాలిఫైయర్-2లో అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ ఆదిలోనే విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన కోహ్లి.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో వికెట్…