ప్రధాని మోడీని యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కలిశారు. పాట్నా ఎయిర్పోర్టులో తల్లిదండ్రులతో కలిసి వైభవ్ సూర్యవంశీ.. మోడీని కలిశారు. చిన్న వయసులో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్లో ఆడిన వైభవ్ సూర్యవంశీ రికార్డ్లు సృష్టించాడు.
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025 సంబంధించి ప్రస్తుతం ప్లేఆఫ్స్ సంబంధించి 4 జట్లు ఖరారు అయ్యాయి. ఇకపోతే లీగ్ దశను పూర్తి చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇక ఏ క్రికెట్ అభిమానిని అడిగిన సరే ఈ ఐపీఎల్ లో మర్చిపోలేని బాట్స్మెన్ ఎవరు అంటే వచ్చే కామన్ సమాధానం రాజస్థాన్ రాయల్స్ ప్రామిసింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ అని. ఎందుకంటే, 14 ఏళ్లున్న ఈ చిచ్చరపిడుగు సృష్టించిన విధ్వసం అలాంటిది…
వైభవ్ మాత్రం సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. అందరూ ధోనీకి షేక్ హ్యాండ్ ఇస్తాడనుకున్నారు. కానీ వైభవ్ ఆ పని చేయలేదు. ధోనీ కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు.
మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురికావొద్దని ఎంఎస్ ధోనీ తెలిపారు. సీనియర్ ప్లేయర్స్, కోచింగ్ స్టాఫ్ నుంచి అన్ని విషయాలను నేర్చుకోండి.. యువ ఆటగాళ్లు 200 ప్లస్ స్ట్రైక్రేట్తో రన్స్ చేయాలనుకున్నప్పుడు, బ్యాటింగ్లో నిలకడ కొనసాగించడం కష్టం.. అయినా మ్యాచ్లో ఏ దశలో అయినా సిక్స్లు కొట్టగల సామర్థ్యం వారు సొంతం చేసుకోవాలని ఎంఎస్ ధోనీ పేర్కొన్నారు.
RR vs PBKS: కీలక మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. 12 మ్యాచ్ల్లో 8వ విజయం అందుకున్న పంజాబ్ ప్లే ఆఫ్స్కు మరో అడుగు దూరంలో ఉంది.
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠగా జరిగగా.. చివరికి 1 పరుగు తేడాతో కేకేఆర్ గెలుపొందింది. చివరి బంతికి మూడు రన్స్ అవసరం కాగా.. శుభమ్ దుబే ఒకే రన్ తీశాడు. ఛేదనలో ఆర్ఆర్ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఈ విజయంతో కోల్కతా ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు రాజస్థాన్…
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్ యాజమాన్యానికి తలనొప్పిగా మారాడా.. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ జట్టులోకి ఎంట్రీ ఇస్తే వైభవ్ ని పక్కన పెట్టేస్తారా.. ద్రవిడ్- సంజు శాంసన్ మధ్య విభేదాలను వైభవ్ పెంచుతున్నాడా.. ప్రస్తుతం క్రికెట్ కారిడార్లో వైభవ్ సూర్యవంశీ పేరు బాగా వినిపిస్తుంది.
Vaibhav Suryavanshi: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శనతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, తాజాగా గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచ్లో కేవలం 35 బంతుల్లోనే శతకం సాధించి క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్లో అతను మోతంగా 38 బంతులతో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో మొత్తం 101 పరుగులు సాధించాడు. Read Also: Vaibhav…
Vaibhav Suryavanshi: జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 209 భారీ స్కోర్ ను సాధించించింది. ఇక 210 పరుగుల భారీ టార్గెట్ ను చేధించడానికి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ బౌలర్ల పై ఎటువంటి కనికరం చూపించకుండా ఆకాశమే హద్దుగా…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అతిపిన్న వయసులో హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 14 సంవత్సరాల 32 రోజుల వయసులో వైభవ్ అర్ధ సెంచరీ బాదాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్.. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 17 బంతుల్లో 6 సిక్సులు, 3 ఫోర్లతో అర్ధ శతకం చేశాడు.…