Congress: ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో కాంగ్రెస్ పార్టీ 85 ప్లీనరీ జరుగుతోంది. 2024 సాధారణ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టేలా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. థర్డ్ ఫ్రంట్ బీజేపీకి ఎన్నికల్లో మాత్రమే సాయపడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో పోరాడేందుకు భావసారుప్యత కలిగిన లౌకిక పార్టీలతో, విపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని అని…
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి విరమణ చేయడాన్ని ప్రస్తావించారు. భారత్ జోడో యాత్ర పార్టీకి కీలక మలుపు అని ఆమె అన్నారు. నా ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిస్తుంది అని అన్నారు. భారత ప్రజలు సామరస్యం, సహనం మరియు సమానత్వాన్ని కోరుకుంటున్నారని యాత్ర నిరూపించిందని అన్నారు.
త్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సభ్యులందరినీ నామినేట్ చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కట్టబెడుతూ పార్టీ స్టీరింగ్ కమిటీ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్లో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు.. మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెలలో యూకే పర్యటనకు వెళ్లనున్నారు. ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ స్కూల్ లో ఉపన్యాసం ఇవ్వనున్నారు. యూకే పర్యటన వివరాలను రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించచి ఉపన్యాసం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. "భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, ప్రజాస్వామ్యంతో సహా వివిధ అంశాలపై కొంతమంది తెలివైన వారిని కలుసుకోవడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.
Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణకు వ్యతిరేఖంగా కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజలు ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న కట్టడాలను ప్రభుత్వం కూల్చివేస్తోందని బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంత ప్రజలు బీజేపీని ఎదుర్కోవాల్సిందే అని అన్నారు.
Mallikarjun Kharge: వ్యాపారవేత్త అదానీకి వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక పార్లమెంట్ ను కదిపేస్తోంది. బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ టార్గెట్ గా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై లోక్ సభలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఆయన ప్రసంగంలోని కొన్ని పదాలను రికార్డుల నుంచి తొలగించారు.