PM Narendra Modi: నన్ను కించపరిచేందుకు చాలా కష్టపడుతున్నారు.. కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ ప్రధాని విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. తనను కించపరిచేందుకు దేశం లోపల, బయట వ్యక్తులు కుమక్కై పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఇటీవల రాహుల్ గాంధీ శిక్ష, అనర్హత తర్వాత పలు దేశాలు స్పందించడం, యూకే, అమెరికా, జర్మనీ వంటి దేశాలు రాహుల్ గాంధీ విషయాన్ని గమనిస్తున్నామని చెప్పడం తర్వాత ప్రధాని ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం భోపాల్-న్యూ ఢిల్లీల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఈ విషయంలో విదేశాల స్పందన అనంతరం కాంగ్రెస్ విదేశీ జోక్యం కోరుతుందని బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నోట నుంచి కూడా ఇలాంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.
Read Also: Delhi Hit And Drag Case: యువతిని కారు ఈడ్చుకెళ్లిన కేసులో 800 పేజీల ఛార్జిషీట్ దాఖలు..
Also Read
- Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
- Cockroach Janta Party: "బొద్దింకల పార్టీ"పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
- Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ శిల్పం తొలగింపు
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
మన దేశంలో 2014 నుంచి కొంత మంది బహిరంగంగా మోదీ ప్రతిష్టను దిగజార్చుతామని సంకల్పంతో పనిచేస్తున్నారని ప్రధాని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులకు సహాయం చేయడానికి కొంతమంది దేశంలో, మరికొంత మంది విదేశాల్లో ఉంటూ సహాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యక్తులు నిరంతరం మోదీ ప్రతిష్టను దిగజార్చడానికి, చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. కానీ మోదీ దేశంలోని పేదలు, మధ్యతరగతి, గిరిజనులు, దళితులు, వెనుకబడిన తరగతులు మరియు ప్రతి భారతీయుడికి భద్రతగా మారాడాని అన్నారు. ఇలాంటి వారి కుట్రల మధ్య ప్రతీ భారతీయుడు దేశాభివృద్ధిపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాల్లో బిజీగా ఉండేవని, కనీసం ప్రజల అసవరాలు కూడా తీర్చేలేనంతగా బిజీగా ఉండేవని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఒక కుటుంబాన్ని మాత్రమే దేశానికి మొదటి కుటుంబంగా భావించి పేద, మధ్యతరగతిని విస్మరించారని అన్నారు.
ఇదిలా ఉంటే రాహుల్ విషయంపై జర్మనీ, యూకే, అమెరికా స్పందించాయి. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నాయి. ఇటీవల రాహుల్ గాంధీపై జర్మనీ విదేశీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేయగా, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జర్మనీకి థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ భారత అంతర్గత విషయాల్లో విదేశీ జోక్యాన్ని కోరుతుందని విమర్శించారు. అయితే దీంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. భారత ప్రజాస్వామ్యాన్ని తామే రక్షించుకుంటామని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
-
Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
-
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!