Rahul Gandhi: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) చట్టం, ఇతర డిమాండ్లలో 200 రైతు సంఘాలు ఢిల్లీ ఛలో మార్చ్కి పిలుపునిచ్చాయి. దీంతో ఢిల్లీ-హర్యానా సరిహద్దులు ఉద్రిక్తంగా మారాయి. ట్రాక్టర్లతో వచ్చిన రైతుల్ని పోలీసులు, కేంద్రబలాగాలు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతుల్ని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. మరోవైపు ఎలాగైనా ఢిల్లీ వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి రుణమాఫీ చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పింఛన్ల పథకాన్ని…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాని మోడీకి (PM Modi) లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్లో ఉన్న MGREGS కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రధానికి రాహుల్ లేఖ పంపించారు.
తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం.. అసెంబ్లీలో ఆమోదం.. తెలంగాణ రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును తెలంగాణ శాసనసభ సోమవారం ఆమోదించింది. సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2003 సవరణ బిల్లు ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ రోజు సభ సమావేశమైన వెంటనే, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తరపున శాసనసభా వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కొనసాగుతోంది. అయితే త్వరలో జరగనున్న యూపీ షెడ్యూల్లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది.
ప్రధాని మోడీ ఓబీసీ కులంపై రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రం తోసిపుచ్చింది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒడిషాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో ప్రధాని మోడీ ఓబీసీ కాదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
OBC Row: రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పీఎం మోడీ వెనకబడిన వర్గాల్లో(ఓబీసీ)లో పట్టలేదని గురువారం రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒడిశాలో జరుగుతున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని తనను తాను ఓబీసీగా చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఓబీసీల్లో చేర్చిన ‘ఘంచీ’ కులానికి చెందిన కుటుంబంలో ఆయన ప్రధాని మోడీ జన్మించారని అన్నారు.
ప్రధాని మోడీ ఓబీసీ కులంలో పుట్టలేదని.. ఆయన తన కులం గురించి అబద్ధాలు చెబుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గురువారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తన కులం గురించి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.
PM Modi: పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ బానిస మనస్తత్వం వల్ల దేశం వెనకబడి పోయిందని, గత 10 ఏళ్లలో దేశాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాంగ్రెస్ ని పుట్టించిందే బ్రిటీష్ వ్యక్తి అని ఎద్దేవా చేశారు. నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించారని ఆరోపించారు.
PM Modi: రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ యువరాజును స్టార్-అప్గా ప్రజెంట్ చేసిందని, కానీ నాన్ స్టార్టప్ అని తేలిందని’’ అన్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించిన అతడిని లాంచ్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.