Drones: ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఉగ్రచర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలొస్తున్నాయ్. కారణం నిత్యం దేశ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా పాక్ డ్రోన్లు దేశంలోకి ప్రవేశిస్తుండడం కలవర పెడుతోంది. ఈ క్రమంలోనే పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ల కలకలం రేగింది.
పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న పంజాబ్లోని సరిహద్దు జిల్లా తరన్ తరణ్లోని పోలీస్ స్టేషన్పై ఈ తెల్లవారుజామున రాకెట్ లాంచర్ తరహా ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తేలికపాటి రాకెట్తో ఉగ్రవాదులు దాడి చేశారని వెల్లడించారు.