వారిద్దరూ అధికారపార్టీ ప్రజాప్రతినిధులే. ఒకే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ఒకరినొకరు ఎదురుపడటానికి కూడా ఇష్టపడరని టాక్. ఇప్పుడు ఆ వార్.. పార్టీలోనూ చిచ్చు పెడుతోందట. విభేదాలు రోడ్డెక్కి రచ్చ రచ్చ..!ఈయన కాసు మహేష్రెడ్డి. వైసీపీ ఎమ్మెల్యే. ఇంకో నేత జంగా కృష్ణమూర్తి. వైపీపీ ఎమ్మెల్సీ. ఇద్దరిదీ గుంటూరు జిల్లా గురజాల. పల్నాడు ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు నాయకులు అధికారపార్టీలోనే ఉన్నా.. ఒకరినొకరు వైరిపక్షాలుగా చూసుకుంటారు. ఇద్దరి మధ్య…
ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట. నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరే ఎడమొఖం పెడమొఖంగా ఉండే వాళ్ళు. ఇద్దరు కలిసి ఒక కార్యక్రమానికి హాజరైరా మాటలు ఉండేవి కావు. ఇప్పుడా ఇద్దరి మధ్యా మూడో వ్యక్తి ఎంట్రీతో మరింత గ్యాప్ పెరిగిందట. చివరికి మా ఎమ్మెల్యేని తక్కువ చేస్తే ఊరుకోం అని సంకేతాలిస్తున్నారట.. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గo. ఒకప్పుడు టీడీపీ కంచుకోట. ఈ నియోజకవర్గంలో లో 2019 మినహా గతంలో…