Prakash Raj తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన “ది కాశ్మీర్ ఫైల్స్” మూవీ దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రధాన మంత్రి మోడీ నుంచి సామాన్యుల దాకా సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమాపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా…
బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలిసిన బృందంలో ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి తెలంగాణాలోని కొన్ని నీటిపారుదల ప్రాజెక్ట్స్ ను ప్రకాశ్ రాజ్ సందర్శించారు. ఇదే సమయంలో ఆయన నటన, చిత్ర నిర్మాణాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇటీవలే ప్రకాశ్రాజు, నవీన్చంద్ర, కార్తీక్ రత్నం, వాణీబోజన్,…
శాండల్వుడ్ మాత్రమే కాకుండా యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. యష్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఈ సినిమా గురించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే తాజాగా “కేజీఎఫ్ : చాప్టర్ 2”…
సినీనటుడు ప్రకాష్ రాజ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. తెలంగాణలో నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని, 40 లక్షల మంది నిరుద్యోగులను కలవాలని ప్రకాష్ రాజ్ కి సూచించారు శ్రవణ్. ఇందిరా పార్క్ కి ఒక్కసారి వచ్చి చూడు. బుద్ది..జ్ఞానం లేదా ప్రకాష్ రాజ్ నీకు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు నీకు గుర్తు లేవా..? ప్రతిపక్ష ఎమ్మెల్యే లను కొన్న కేసీఆర్ కి మద్దతు ఇవ్వడానికి సిగ్గుండాలి కదా ప్రకాష్…
సృజన, సాంకేతికత మేళవించిన సినిమా రంగం పై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి అంటూ నటుడు ప్రకాష్ రాజ్ సూటిగా ప్రశ్నించారు. తాజాగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబడుతున్న విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా విడుదల సమయంలో ఏపీ థియేటర్స్ వద్ద తీవ్ర అడ్డంకి ఏర్పడింది. అంతకు ముందున్న రేట్లనే అమ్మాలని సినిమాపై ఆంక్షలు విధించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న…
టాలీవుడ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఏపీలో టికెట్ ధరలపై కొత్త జీవో వస్తుందని ఆశించిన ‘భీమ్లా నాయక్’ నిరాశే ఎదురయ్యింది. అంతేనా సినిమా విడుదల సమయంలో ఏపీ థియేటర్ల వద్ద సీఆర్ఫీఎఫ్ జవాన్లు కన్పించడంపై చర్చ జరిగింది. కానీ ఏపీ మంత్రులు మాత్రం మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా జీవో వాయిదా పడిందని, కావాలంటే జీవో వచ్చేదాకా సినిమాను వాయిదా వేసుకుని ఉండాల్సింది అంటూ సమర్థించుకుంటున్నారు.…
దేశంలో రాజకీయాలను మార్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అందులో భాగంగా కేసీఆర్ ఆదివారం ముంబై బయలుదేరి వెళ్ళారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్పవార్లతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట.. ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు జె.సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బి.బి పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ముంబయి పర్యటన…
ప్రకాశ్రాజ్, నవీన్చంద్ర, కార్తీక్రత్నం కీలకపాత్రధారులుగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభం అయింది. శ్రీ, కావ్య సమర్పణలో ఈ చిత్రాన్ని థింక్ బిగ్ పతాకంపై ‘తలైవి’ దర్శకుడు ఏ.ఎల్. విజయ్, ప్రకాశ్రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాశ్రాజ్, శ్రీ షిరిడిసాయి మూవీస్ పై యం. రాజశేఖర్ రెడ్డి, శ్రీక్రియేషన్స్పై బి.నర్సింగరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వాలీ మోహన్దాస్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. తనికెళ్ల భరణి పూజతో సినిమా ప్రారంభం అయ్యింది. దర్శకుడు వేగేశ్న…
నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించిన ‘నటసమ్రాట్’ అనే మరాఠీ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెలుగులో ప్రకాశ్ రాజ్ కీలక పాత్రధారిగా ‘రంగ మార్తాండ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. జనవరి ప్రధమార్థంలో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అలీ రజా తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ శ్యామల ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మధు కాలిపు ఈ…
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రం షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘నటసమ్రాట్’కు ఇది తెలుగు రీమేక్. అక్కడ నానా పటేకర్ పోషించిన పాత్రను ఇక్కడ ప్రకాశ్ రాజ్ చేస్తున్నారు. ‘రంగమార్తాడ’ సినిమా గురించి కృష్ణవంశీ చెబుతూ.. ‘నా అభిమాన నటుడు, నట రాక్షసుడు ప్రకాశ్ రాజ్ తో ఎమోషనల్ క్లయిమాక్స్ చిత్రీకరణ జరుపుతున్నాను’ అని పేర్కొన్నారు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం,…