సినీనటుడు ప్రకాష్ రాజ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. తెలంగాణలో నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని, 40 లక్షల మంది నిరుద్యోగులను కలవాలని ప్రకాష్ రాజ్ కి సూచించారు శ్రవణ్. ఇందిరా పార్క్ కి ఒక్కసారి వచ్చి చూడు. బుద్ది..జ్ఞానం లేదా ప్రకాష్ రాజ్ నీకు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు నీకు గుర్తు లేవా..? ప్రతిపక్ష ఎమ్మెల్యే లను కొన్న కేసీఆర్ కి మద్దతు ఇవ్వడానికి సిగ్గుండాలి కదా ప్రకాష్ రాజ్ అంటూ ధ్వజమెత్తారు.
నువ్వు బెంగుళూరులో పోటీ చేస్తే నీకు వచ్చింది 24 వేల ఓట్లు. దాన్ని వదిలేసి… తెలంగాణలో తిరుగుతున్నావు ప్రకాష్ రాజ్. కాంగ్రెస్ కి నష్టం కలిగించే పనిలో ఉన్నారు కేసీఆర్. బీజేపీ, కేసీఆర్ కలిసి డ్రామా లాడుతున్నారు. మోడీని అడ్డం పెట్టుకొని తెలంగాణలో గెలవాలని చూస్తున్నారు కేసీఆర్. గడ్డిపోచ లాంటి ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్లను తెచ్చుకుని ఏదో చేద్దామనుకుంటున్నారు. వరదలో కొట్టుకు పోయె వాడికి గడ్డిపోచ లాగా పీకే దొరికాడు.
రాజకీయ వ్యభిచారి పీకే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు దాసోజు శ్రవణ్. పీకేతో 500 కోట్ల డీల్ కుదుర్చుకున్నారు కేసీఆర్. పీకేకి అసలు విలువలు ఉన్నాయా..? ప్రశాంత్ కిషోర్ ఒక్కడికే కేసీఆర్ 500 కోట్లు ఇచ్చాడు. విద్యావంతులు..మేధావులు అర్దం చేసుకోవాలి. తెలంగాణ రాజకీయ వ్యాపార ప్రయోగ శాలగా మార్చేశారు కేసీఆర్. మల్లన్న సాగర్ ని కాదు… భూమి కోల్పోయిన బాధితులను పీకే చూడాలన్నారు శ్రవణ్.