Home
Politics
Politics News
-
కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టేలా వైసీపీ ఎత్తుగడలు…!
కుప్పంలో వైసీపీ నేతలు ఏం చేసినా టీడీపీ అధినేత చంద్రబాబు కోసమేనట. ఒక పథకంతో రెండు ప్రయోజనాలను పొందే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. దానిపైనే ఇప్పుడు రెండు పార్టీల్లోనూ చర్చ. అదేంటో ఇప్పుడు చూద్దాం. కుప్పంలో నాడు-నేడు పథకానికి ప్రాధాన్యం టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం. వరసగా ఏడుసార్లు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. కిందటి ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీకి దక్కింది కుప్పమే. ఆ ఎన్నికల్లోనే వైసీపీ పూర్తిగా ఇక్కడ ఫోకస్… -
ఏపీ రాజకీయాల ముఖచిత్రం మారుతోందా…?
మనసులు మారుతున్నాయా? పాత స్నేహాలు నెమరేసుకుంటున్నారా? కొత్త సమీకరణాలకు సరికొత్తగా తెర లేస్తోందా? ఉమ్మడి శత్రువుపైకి కలిసికట్టుగా దండెత్తబోతున్నారా? ఏపీ రాజకీయ ముఖచిత్రంలో మార్పులకు ఈ కలయికలు సంకేతామా.? అంతా ఏకమయ్యే అజెండాపై ప్రతిపక్షాలు ఫోకస్? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది అందరికీ తెలిసిందే.. ఈ మధ్య అందరూ చూస్తోందే. ఏపీలో అదే సీన్ మళ్లీ రిపీట్ కాబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ చేతిలో కకావికలమైన విపక్షాలు ఒకే గూటికి… -
ఎవరు రచ్చ చేస్తున్నారూ..? ఎవరు బురద కడుక్కుంటున్నారూ..?
రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం సహజం. ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఇలాంటి పొలిటికల్ వారే నడుస్తోంది. జిల్లాకు ఒకరిని చొప్పున టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకరు రచ్చ చేస్తుంటే.. ఇంకొకరు బురద కడుక్కొంటున్నారు. మరి.. అంతిమంగా ఎవరు పైచెయ్యి సాధిస్తున్నారు? ఎవరి గేమ్ప్లాన్కు ఇంకెవరు చిత్తవుతున్నారు? తాడిపత్రిలో మీడియా అటెన్షన్ క్యాచ్ చేసిన జేసీ! గ్రౌండ్లో ఆడే ఆటల్లానే అటాకింగ్, స్ట్రాటజీ.. డిఫెన్స్ మోడ్ లాంటి విధానాలు రాజకీయ క్రీడల్లోనూ కనిపిస్తాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ… -
చిత్తూరు జిల్లాలో దిక్కులేని తెలుగు తమ్ముళ్లు…!
ఏదైనా సమస్య వస్తే నాయకుడి దగ్గరకు కేడర్ వెళ్లడం సాధారణం. పార్టీ పవర్లో ఉన్నా.. లేకపోయినా.. శ్రేణులకు అందుబాటులో ఉన్న నేతలే దేవుళ్లు. ఆ జిల్లాలో మాత్రం కేడర్ను, పార్టీని పట్టించుకునే వాళ్లు లేరు. తమ్ముళ్లు దిక్కులేని వారిగా మారిపోయారు. అధినేత ఎప్పుడు కరుణిస్తారా అని రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో దిక్కులేకుండా పోయిన టీడీపీ కేడర్! చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు ఈ దఫా పెద్దకష్టమే వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత… -
రాజధానిలో రోడ్లు దొంగతనం…త్వరలో పట్టుకుంటామంటున్న పోలీసులు…
ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని ప్రకటించిన తరువాత రాజధాని ప్రాంతంలో రోడ్లు వేశారు. అయితే, ఇప్పుడు ఆ రోడ్లు ఉన్నట్టుండి మాయం అవుతున్నాయి. వేసిన రోడ్లను దొంగతనం చేస్తున్నారు. ఇది వినడానికి వింతగా ఉన్నా నిజమని స్థానికులు చెబుతున్నారు. రాత్రిసమయంలో కొంతమంది రోడ్లను తవ్వుకొని ఎత్తుకుపోతున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇదంతా అధికారపార్టీకి చెందిన వ్యక్తులే చేస్తున్నారని, రాజధానిగా అమరావతి ఉండటం వారికి ఇష్టంలేదని అందుకే అలా చేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. ఇది తమపని… -
కర్ణాటక సీఎం మార్పుపై సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు… ఆయన్ను మారిస్తే…
కర్ణాటకలో నాయక్వంలో మార్పు ఉండొచ్చని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే విషయం ఇప్పటి వరకు స్పష్టంకాలేదు. అయితే, ముఖ్యమంత్రిని మారిస్తే ఇబ్బందులు వస్తాయని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టం అవుతుందని కొందరివాదన. అటు అధిష్టానం కూడా యడ్డియూరప్పను మార్చేందుకు సాహసం చేయడంలేదు. కర్ణాటక తాజా రాజకీయాలపై బీజేసీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చడం పెద్ద సాహసమే అవుతుందని, రాష్ట్రంలో తొలిసారి బీజేపి… -
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ..? ఆయనే క్లారిటీ ఇచ్చారు..
ఐపీఎస్ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ రాజీనామా చేశారు. వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. 26 ఏళ్లుగా తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్కుమార్… తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీగా సేవలు అందించారు. స్వచ్ఛందంగా పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. తన మనసుకు ఇష్టమైన పనులు తనకు ఇష్టమైన రీతిలో చేయబోతున్నానని తెలిపారు. అయితే,… -
శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీలో కొత్త చర్చ…
ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంపై శీతకన్ను వేశారు ఒకరు. పార్టీ బలోపేతం కోసం అక్కడ గేర్ మార్చారు ఇంకొకరు. అదే అక్కడ కొత్త చర్చకు దారితీసింది. నాయకత్వాన్ని మార్చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అనుకున్నారో ఏమో… అంతా కలిసి ఐక్యతా రాగం ఆలపించారు. మరి… కేడర్కు క్లారిటీ వచ్చినట్టేనా? టీడీపీలో చర్చకు దారితీసిన ఆ ఎపిసోడ్ను ఇప్పుడు చూద్దాం. పలాసపై ఎంపీ రామ్మోహన్నాయుడు స్పెషల్ ఫోకస్! శ్రీకాకుళం జిల్లా పలాస. 2019 ఎన్నికల్లో టీడీపీ… -
చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా…?
ఎక్కడో ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్న చిరంజీవి పేరు మళ్లీ రాజకీయ తెరపైకి ఎందుకు వచ్చింది? AICC ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీ ఏం చెప్పాలనుకున్నారు? చిరంజీవి కాంగ్రెస్ వాదే అన్న AICC ప్రకటనలో అంతరార్థం ఏంటి? సీఎం జగన్ను ప్రశంసిస్తూ చిరు ట్వీట్స్ పెడుతున్న సమయంలో.. అన్నయ్య వస్తాడు అంటూ జనసైనికులు కలల కంటున్న తరుణంలో ఈ కొత్త అంచానాలను ఎలా చూడాలి? కాంగ్రెస్ నేతల ప్రకటనతో చర్చల్లోకి చిరంజీవి పేరు ప్రజారాజ్యంను కాంగ్రెస్లో విలీనం… -
తమిళ రాజకీయంలో మళ్లీ గందరగోళం…శశికళ మళ్లీ రాజకీయాల్లోకి వస్తుందా?
తమిళనాడు రాజకీయాల్లోకి మళ్లీ శశికళ రాబోతుందా అంటే కొంతమంది అవుననే అంటున్నారు. 2016లో ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత పార్టీని తాత్కాలికంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. అనంతరం ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్షను అనుభవించిన శశికళ తమిళనాడు ఎన్నికలకు ముందు బెయిల్పై విడుదలయ్యారు. పార్టీలో తిరిగి చేరాలన్న ఆమె కలను పలనీస్వామీ, పన్నీర్ సెల్వంలు అడ్డుకున్నారు. చిన్నమ్మ తిరిగి పార్టీలోకి రాకుండా సమర్ధవంతంగా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నాడిఎంకే…
తాజావార్తలు
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్కు అదిరిపోయే ఓపెనింగ్స్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!