ఎవరు రచ్చ చేస్తున్నారూ..? ఎవరు బురద కడుక్కుంటున్నారూ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం సహజం. ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఇలాంటి పొలిటికల్ వారే నడుస్తోంది. జిల్లాకు ఒకరిని చొప్పున టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకరు రచ్చ చేస్తుంటే.. ఇంకొకరు బురద కడుక్కొంటున్నారు. మరి.. అంతిమంగా ఎవరు పైచెయ్యి సాధిస్తున్నారు? ఎవరి గేమ్ప్లాన్కు ఇంకెవరు చిత్తవుతున్నారు?
తాడిపత్రిలో మీడియా అటెన్షన్ క్యాచ్ చేసిన జేసీ!
Also Read
గ్రౌండ్లో ఆడే ఆటల్లానే అటాకింగ్, స్ట్రాటజీ.. డిఫెన్స్ మోడ్ లాంటి విధానాలు రాజకీయ క్రీడల్లోనూ కనిపిస్తాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అటాకింగ్ వ్యూహంతో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒక్కో జిల్లాలో ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుని వేడి రాజేస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి.. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఇరుకున పెట్టడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు పెద్దారెడ్డి ఏకంగా జేసీ ఇంటికెళ్లి హడావిడి చేశారు. ఫలితంగా తాడిపత్రి మున్సిపాలిటీని జేసీకి తాంబూలంలో పెట్టి ఇచ్చినట్టు అయ్యిందని వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో సమీక్ష పేరుతో మీడియా అటెన్షన్ను క్యాచ్ చేశారు జేసీ ప్రభాకర్రెడ్డి.
ఉమా అరెస్ట్పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ!
అలాగే కృష్ణా జిల్లా మైలవరంలోనూ మాజీ మంత్రి దేవినేనిఉమా వేసిన స్కెచ్లో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పడ్డారా అన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. అక్రమ మైనింగ్ పేరుతో ఉమా పదిమందిని వేసుకుని వెళ్లి హడావిడి చేయడానికి ప్రయత్నిస్తే.. వైసీపీ కార్యకర్తల దూకుడుగా వెళ్లారని అనుకుంటున్నారు. ఫలితంగా ఉమాపై కేసులు.. అరెస్ట్.. జైలు వరకు వెళ్లింది. ఒక నియోజకవర్గంలోని అంశం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
పలాసలో మంత్రి అప్పలరాజుపై శిరీష అటాకింగ్!
నెల్లూరులో ఎమ్మెల్యే కాకాణి వర్సెస్ సోమిరెడ్డి!
శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజుపై లక్ష్యంగా టీడీపీ నేత గౌతు శిరీష ఆరోపణలు మొదలుపెట్టారు. తనను కించపరిచేలా వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారని.. ఇదంతా మంత్రి కనుసన్నల్లోనే జరుగుతుందన్నది శిరీష అటాకింగ్ కంటెంట్. అలాగే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి.. అప్పులుపై PAC ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కొద్దిరోజులుగా విమర్శలు చేస్తున్నారు. వీటిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి వివరణ ఇచ్చి తర్వాత సైలెంట్ అయ్యారు. ఇక నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్రెడ్డిపై, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వరస ఆరోపణలు చేస్తున్నారు.
టీడీపీ రాష్ట్రస్థాయిలో చర్చ కోరుకుంటోందా?
ఇదంతా చూస్తుంటే జిల్లాల వారీగా ఒక్కొక్కరిని టార్గెట్గా చేసుకుని.. ఆరోపణలు, విమర్శలు చేయాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. లోకల్ లెవెల్ ఇష్యూ అయినా రాష్ట్ర స్థాయిలో డిబేట్ జరగాలన్నది ప్రతిపక్షం ఎత్తుగడగా ఉంది. ఈ వ్యూహం పసిగట్టలేదో.. ఏమో టీడీపీ వేసిన బురదను కడుక్కోవటంలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు వైసీపీ నేతలు. దీనిపైనే చర్చ జరుగుతోంది. మరి.. రానున్న రోజుల్లో టీడీపీ రాజకీయ ఎత్తుగడలకు అధికారపార్టీ వ్యూహం మారుతుందా? లేక వారి అజెండాలో చిక్కుకుని వివరణ ఇవ్వటంలోనే కాలం గడిపేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!