ఎవరు రచ్చ చేస్తున్నారూ..? ఎవరు బురద కడుక్కుంటున్నారూ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం సహజం. ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఇలాంటి పొలిటికల్ వారే నడుస్తోంది. జిల్లాకు ఒకరిని చొప్పున టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకరు రచ్చ చేస్తుంటే.. ఇంకొకరు బురద కడుక్కొంటున్నారు. మరి.. అంతిమంగా ఎవరు పైచెయ్యి సాధిస్తున్నారు? ఎవరి గేమ్ప్లాన్కు ఇంకెవరు చిత్తవుతున్నారు?
తాడిపత్రిలో మీడియా అటెన్షన్ క్యాచ్ చేసిన జేసీ!
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
గ్రౌండ్లో ఆడే ఆటల్లానే అటాకింగ్, స్ట్రాటజీ.. డిఫెన్స్ మోడ్ లాంటి విధానాలు రాజకీయ క్రీడల్లోనూ కనిపిస్తాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అటాకింగ్ వ్యూహంతో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒక్కో జిల్లాలో ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుని వేడి రాజేస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి.. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఇరుకున పెట్టడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు పెద్దారెడ్డి ఏకంగా జేసీ ఇంటికెళ్లి హడావిడి చేశారు. ఫలితంగా తాడిపత్రి మున్సిపాలిటీని జేసీకి తాంబూలంలో పెట్టి ఇచ్చినట్టు అయ్యిందని వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో సమీక్ష పేరుతో మీడియా అటెన్షన్ను క్యాచ్ చేశారు జేసీ ప్రభాకర్రెడ్డి.
ఉమా అరెస్ట్పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ!
అలాగే కృష్ణా జిల్లా మైలవరంలోనూ మాజీ మంత్రి దేవినేనిఉమా వేసిన స్కెచ్లో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పడ్డారా అన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. అక్రమ మైనింగ్ పేరుతో ఉమా పదిమందిని వేసుకుని వెళ్లి హడావిడి చేయడానికి ప్రయత్నిస్తే.. వైసీపీ కార్యకర్తల దూకుడుగా వెళ్లారని అనుకుంటున్నారు. ఫలితంగా ఉమాపై కేసులు.. అరెస్ట్.. జైలు వరకు వెళ్లింది. ఒక నియోజకవర్గంలోని అంశం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
పలాసలో మంత్రి అప్పలరాజుపై శిరీష అటాకింగ్!
నెల్లూరులో ఎమ్మెల్యే కాకాణి వర్సెస్ సోమిరెడ్డి!
శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజుపై లక్ష్యంగా టీడీపీ నేత గౌతు శిరీష ఆరోపణలు మొదలుపెట్టారు. తనను కించపరిచేలా వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారని.. ఇదంతా మంత్రి కనుసన్నల్లోనే జరుగుతుందన్నది శిరీష అటాకింగ్ కంటెంట్. అలాగే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి.. అప్పులుపై PAC ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కొద్దిరోజులుగా విమర్శలు చేస్తున్నారు. వీటిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి వివరణ ఇచ్చి తర్వాత సైలెంట్ అయ్యారు. ఇక నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్రెడ్డిపై, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వరస ఆరోపణలు చేస్తున్నారు.
టీడీపీ రాష్ట్రస్థాయిలో చర్చ కోరుకుంటోందా?
ఇదంతా చూస్తుంటే జిల్లాల వారీగా ఒక్కొక్కరిని టార్గెట్గా చేసుకుని.. ఆరోపణలు, విమర్శలు చేయాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. లోకల్ లెవెల్ ఇష్యూ అయినా రాష్ట్ర స్థాయిలో డిబేట్ జరగాలన్నది ప్రతిపక్షం ఎత్తుగడగా ఉంది. ఈ వ్యూహం పసిగట్టలేదో.. ఏమో టీడీపీ వేసిన బురదను కడుక్కోవటంలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు వైసీపీ నేతలు. దీనిపైనే చర్చ జరుగుతోంది. మరి.. రానున్న రోజుల్లో టీడీపీ రాజకీయ ఎత్తుగడలకు అధికారపార్టీ వ్యూహం మారుతుందా? లేక వారి అజెండాలో చిక్కుకుని వివరణ ఇవ్వటంలోనే కాలం గడిపేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!